వామ్మో మనిషిని మృగంలా మార్చేస్తున్న డ్రగ్?
డ్రగ్ భూతం ప్రస్తుతం ప్రపంచాన్ని చాలా దారుణంగా ముంచేస్తుంది. చాలా మంది దీని బారిన పడి తమ జీవితాలని నాశనం చేసుకుంటున్నారు. ఇక డ్రగ్ ఓవర్ డోసు కారణంగా ప్రజల చర్మం కుళ్లిపోయి జాంబీల లాగా కనిపించే పరిస్థితి వచ్చేసింది. ఇక ఈ సంఘటన అమెరికాలో చోటు చేసుకుంది. ట్రాంక్ గా పిలిచే ఈ డ్రగ్ మందు.. ఇప్పుడు అమెరికాలోని మెజారిటీ నగరాల్లో ప్రజలపై చాలా దారుణమైన తీవ్ర ప్రభావాలతో అలజడి సృష్టిస్తుంది.దేశంలోని చాలా నగరాల్లో ఈ మెడిసిన్ కనిపిస్తున్నదని కొన్ని నివేదికల నుంచి సమాచారం తెలుస్తుంది. ఇక ఈ జైలజీన్ డ్రగ్ అనేది జంతువులకు వినియోగించే మందు అని, అయితే దీన్ని మధ్యస్థం నుంచి తీవ్ర ఒంటి నొప్పులను తగ్గించుకొనేందుకు హెరాయిన్ లాగా చాలా అధికంగా వినియోగిస్తున్నారని తెలిపింది.
ఇక మొదటగా ఫిలడెల్ఫియా నగరంలో కనిపించిన ఈ డ్రగ్.. తర్వాత శాన్ఫ్రాన్సిస్కో ఇంకా లాస్ఏంజెల్స్ వంటి నగరాలకు కూడా పాకింది. జంతువులకు వినియోగించేందుకు ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్(ఎఫ్డీఏ) ఆమోదించిన ఈ జైలజీన్ మానవులకు ఏమాత్రం సురక్షితం కాదని, దీన్ని ఓవర్ డో స్ తీసుకొన్న వారికి రివర్స్ చికిత్స కింద ఇచ్చే నాలోక్సోన్కు కూడా స్పందించదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఈ ట్రాంక్ డోప్ అనేది ఫెంటానిల్ మిశ్రమమని, ఇది అమెరికా యువత జీవితాలను ఖచ్చితంగా నాశనం చేస్తున్నదని కొన్ని నివేదికల నుంచి సమాచారం తెలుస్తుంది. ఇక ఈ వెటర్నరీ డ్రగ్ను తక్కువ ధరకే ఏకంగా వీధుల్లోనే అమ్మేస్తుండటం మరింత ఆందోళనకరమైన అంశమని సమాచారం తెలుస్తుంది. ఇంకా ఈ డ్రగ్ దేశమంతటా వ్యాప్తిచెందితే.. అది ప్రజల ఆరోగ్యానికే తీరని ముప్పుగా మారే ప్రమాదం ఉన్నదని ఆరోగ్య శాఖ అధికారులు ఆందోళన వ్యక్తం చేశారు.కాబట్టి ఇలాంటి డ్రగ్స్ బారిన పడకుండా జాగ్రత్తగా ఉండండి.