వామ్మో మనిషిని మృగంలా మార్చేస్తున్న డ్రగ్?

Purushottham Vinay
వామ్మో మనిషిని మృగంలా మార్చేస్తున్న డ్రగ్ ?
డ్రగ్ భూతం ప్రస్తుతం ప్రపంచాన్ని చాలా దారుణంగా ముంచేస్తుంది. చాలా మంది దీని బారిన పడి తమ జీవితాలని నాశనం చేసుకుంటున్నారు. ఇక డ్రగ్ ఓవర్ డోసు కారణంగా ప్రజల చర్మం కుళ్లిపోయి జాంబీల లాగా కనిపించే పరిస్థితి వచ్చేసింది. ఇక ఈ సంఘటన అమెరికాలో చోటు చేసుకుంది. ట్రాంక్ గా పిలిచే ఈ డ్రగ్ మందు.. ఇప్పుడు అమెరికాలోని మెజారిటీ నగరాల్లో ప్రజలపై చాలా దారుణమైన తీవ్ర ప్రభావాలతో అలజడి సృష్టిస్తుంది.దేశంలోని చాలా నగరాల్లో ఈ మెడిసిన్‌ కనిపిస్తున్నదని కొన్ని నివేదికల నుంచి సమాచారం తెలుస్తుంది. ఇక ఈ జైలజీన్‌ డ్రగ్‌ అనేది జంతువులకు వినియోగించే మందు అని, అయితే దీన్ని మధ్యస్థం నుంచి తీవ్ర ఒంటి నొప్పులను తగ్గించుకొనేందుకు హెరాయిన్‌ లాగా చాలా అధికంగా వినియోగిస్తున్నారని తెలిపింది.

ఇక మొదటగా ఫిలడెల్ఫియా నగరంలో కనిపించిన ఈ డ్రగ్‌.. తర్వాత శాన్‌ఫ్రాన్సిస్కో ఇంకా లాస్‌ఏంజెల్స్‌ వంటి నగరాలకు కూడా పాకింది. జంతువులకు వినియోగించేందుకు ఫుడ్‌ అండ్‌ డ్రగ్‌ అడ్మినిస్ట్రేషన్‌(ఎఫ్‌డీఏ) ఆమోదించిన ఈ జైలజీన్‌ మానవులకు ఏమాత్రం సురక్షితం కాదని, దీన్ని ఓవర్‌ డో స్‌ తీసుకొన్న వారికి రివర్స్‌ చికిత్స కింద ఇచ్చే నాలోక్సోన్‌కు కూడా స్పందించదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఈ ట్రాంక్‌ డోప్‌ అనేది ఫెంటానిల్‌ మిశ్రమమని, ఇది అమెరికా యువత జీవితాలను ఖచ్చితంగా నాశనం చేస్తున్నదని కొన్ని నివేదికల నుంచి సమాచారం తెలుస్తుంది. ఇక ఈ వెటర్నరీ డ్రగ్‌ను తక్కువ ధరకే ఏకంగా వీధుల్లోనే అమ్మేస్తుండటం మరింత ఆందోళనకరమైన అంశమని సమాచారం తెలుస్తుంది. ఇంకా ఈ డ్రగ్‌ దేశమంతటా వ్యాప్తిచెందితే.. అది ప్రజల ఆరోగ్యానికే తీరని ముప్పుగా మారే ప్రమాదం ఉన్నదని ఆరోగ్య శాఖ అధికారులు ఆందోళన వ్యక్తం చేశారు.కాబట్టి ఇలాంటి డ్రగ్స్ బారిన పడకుండా జాగ్రత్తగా ఉండండి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: