టీడీపీలోకి కన్నా లక్ష్మీనారాయణ?

Purushottham Vinay
టీడీపీలోకి కన్నా లక్ష్మీనారాయణ?

ఇక ఆంధ్రప్రదేశ్ లో అరాచక పాలన కొనసాగుతోందని విమర్శించారు కన్నా లక్ష్మీనారాయణ. అసలు ప్రజాస్వామ్యం అనేదే పూర్తిగా కనుమరుగైపోయిందని కన్నా ఆవేదన వ్యక్తం చేశారు.సీఎం జగన్ మోహన్ రెడ్డి ఫ్యాక్షన్ సంస్కృతిని పెంచి పోషిస్తున్నారని కన్నా ఆగ్రహం వ్యక్తం చేశారు.ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోలీస్‌ వ్యవస్థ చాలా పూర్తిగా దిగజారిపోయిందని కన్నా మండిపడ్డారు.సోమవారం నాడు గన్నవరంలో జరిగిన ఘటన.. టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభిపట్ల ప్రభుత్వం ఇంకా పోలీసులు వ్యవహరిస్తున్న తీరును చాలా తీవ్రంగా ఖండించారు కన్నా లక్ష్మీనారాయణ.అలాగే ఈ నెల 23 వ తేదీన తెలుగుదేశం పార్టీ ఆఫీసులో, చంద్రబాబు నాయుడు సమక్షంలో తెలుగు దేశం పార్టీలో చేరుతున్నానని చెప్పారు కన్నా లక్ష్మీనారాయణ. సుమారు 2 వేల మంది కార్యకర్తలు ఇంకా అలాగే అనుచరులతో కలిసి టీడీపీలో చేరతానన్నారు.


మరికొందరు నాయకులు కూడా తనతో పాటు టీడీపీలో చేరతారని కన్నా లక్ష్మినారాయణ చెప్పారు.ఇంకా అలాగే మరోవైపు కన్నా లక్ష్మీనారాయణ టీడీపీలో చేరినా తనకేమీ అభ్యంతరం లేదన్నారు మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు. ఇక పార్టీలోకి వచ్చినా ఆయనస్థానం ఆయనకు.. తన స్థానం తనకు ఉంటుందని కూడా అన్నారు. ఇంకా అలాగే గతంలో కాంగ్రెస్‌లో ఇద్దరం కలిసి పనిచేశామని కూడా అన్నారు రాయపాటి.అటు కన్నా లక్ష్మీ నారాయణ వ్యవహారంపై ఆంధ్రప్రదేశ్ బీజేపీ నేతలు చాలామంది కూడా సైలెంట్ అయ్యారు. కేవలం సోము వీర్రాజు ఇంకా జీవీఎల్ మాత్రమే దీనిపై స్పందించారు.. సోము వీర్రాజు అయితే తనపై చేసిన వ్యాఖ్యలను పట్టించుకోను అంటూ కూడా తేల్చి చెప్పారు.జీవీఎల్ మాత్రం కన్నా లక్ష్మీ నారాయణ తీరును పూర్తిగా తప్పుపట్టడం జరిగింది. ఇక ఆయన వెళ్లినంత మాత్రన పార్టీకి వచ్చిన నష్టం ఏమీ లేదని తెలిపారు.ఇక ఈ విధంగా కన్నా లక్ష్మీనారాయణ జగన్ మోహన్ రెడ్డి పై విమర్శలు చేసి తెలుగు దేశం పార్టీలోకి వెళ్లడం జరిగింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: