వరిసు ఆడియో లాంఛ్.. సన్ టీవీలో ఎప్పుడంటే..?
హెచ్ వినోద్ దర్శకత్వంలో అజిత్ కుమార్ హీరోగా నటించిన తునివు సినిమాతో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద పోటీ పడనుంది. ఈ చిత్రం విడుదలకు ముందు వరిసు నిర్మాతలు గ్రాండ్గా ఆడియో లాంచ్ నిర్వహించారు . ఇందులో విజయ్ 2 యేళ్ళ తర్వాత భారీ ప్రేక్షకులను ఉద్దేశించి ప్రసంగించడం గమనార్హం. ఈ కార్యక్రమంలో వేలాది మంది అభిమానులు తలపతి అని అరుస్తూ తమ ఆనందాన్ని పంచుకున్నారు. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రంలో విజయ్ హీరోగా.. రష్మిక మందన్న హీరోయిన్గా నటిస్తున్నారు . అలాగే ప్రకాష్ రాజ్ విలన్ పాత్రలో మరొకసారి తన విలనిజాన్ని చూపించడానికి సిద్ధమవుతున్నారు.
ఇదిలా ఉండగా ఇందులో శరత్ కుమార్, ప్రభు, జయసుధ, ఖుష్బూ, సంగీత తదితరులు కీలకపాత్ర పోషిస్తున్నట్లు సమాచారం.ఎస్ ఎస్ తమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాకి సినిమా ఆటోగ్రాఫర్ గా కార్తీక్ పలని.. ఎడిటర్ గా ప్రవీణ్ భాగం పంచుకోనున్నారు. భారీ అంచనాల మధ్య విడుదల కాబోతున్న ఈ సినిమా ఏ రేంజ్ లో విజయాన్ని అందుకుంటుందని అభిమానుల సైతం ఆతృతగా ఎదురుచూస్తున్నారు. మరి సంక్రాంతి బరిలో పోటీ పడుతున్న ఈ సినిమాలు ఏవి సంక్రాంతి గెలుపును అందుకుంటాయో చూడాలి.