వరిసు ఆడియో లాంఛ్.. సన్ టీవీలో ఎప్పుడంటే..?

Divya
విజయ్ దళపతి నటించిన వరిసు చిత్రం ఆడియో ఆవిష్కరణ డిసెంబర్ 24న చెన్నైలో జరిగింది. ఈ ఈవెంట్ 2023 న్యూ ఇయర్ రోజు సన్ టీవీలో సాయంత్రం 6:30 గంటల నుండి ప్రసారం కానుంది అని అధికారికంగా చిత్ర బృందం ప్రకటించింది. తెలుగు టాప్ డైరెక్టర్ వంశీ పైడిపల్లి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ను రూ.250 కోట్ల భారీ బడ్జెట్ తో టాలీవుడ్ బడా నిర్మాత దిల్ రాజు శ్రీ వెంకటేశ్వర బ్యానర్ పై ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇకపోతే ఈ కార్యక్రమానికి వేలాదిమంది విజయ్ అభిమానులు ఫుల్ జోష్ అలాగే ఉత్సాహంతో హాజరయ్యారు. అందుకే ఈ ఈవెంట్ జనవరి 1 2023 సాయంత్రం 6:30 గంటల నుండి సన్ టీవీలో ప్రసారం చేయబడుతుంది.
హెచ్ వినోద్ దర్శకత్వంలో అజిత్ కుమార్ హీరోగా నటించిన తునివు సినిమాతో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద పోటీ పడనుంది.  ఈ చిత్రం విడుదలకు ముందు వరిసు నిర్మాతలు గ్రాండ్గా ఆడియో లాంచ్ నిర్వహించారు . ఇందులో విజయ్ 2 యేళ్ళ తర్వాత భారీ ప్రేక్షకులను ఉద్దేశించి ప్రసంగించడం గమనార్హం. ఈ కార్యక్రమంలో వేలాది మంది అభిమానులు తలపతి అని అరుస్తూ తమ ఆనందాన్ని పంచుకున్నారు. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రంలో విజయ్ హీరోగా.. రష్మిక మందన్న హీరోయిన్గా నటిస్తున్నారు . అలాగే ప్రకాష్ రాజ్ విలన్ పాత్రలో మరొకసారి తన విలనిజాన్ని చూపించడానికి సిద్ధమవుతున్నారు.
ఇదిలా ఉండగా ఇందులో శరత్ కుమార్, ప్రభు, జయసుధ, ఖుష్బూ, సంగీత తదితరులు కీలకపాత్ర పోషిస్తున్నట్లు సమాచారం.ఎస్ ఎస్ తమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాకి సినిమా ఆటోగ్రాఫర్ గా కార్తీక్ పలని.. ఎడిటర్ గా ప్రవీణ్ భాగం పంచుకోనున్నారు. భారీ అంచనాల మధ్య విడుదల కాబోతున్న ఈ సినిమా ఏ రేంజ్ లో విజయాన్ని అందుకుంటుందని అభిమానుల సైతం ఆతృతగా ఎదురుచూస్తున్నారు. మరి సంక్రాంతి బరిలో పోటీ పడుతున్న ఈ సినిమాలు ఏవి సంక్రాంతి గెలుపును అందుకుంటాయో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: