ఉద్యోగాలు చేస్తున్న వారంతా జీవిత సేవింగ్ కోసం చూస్తారు.. ఏదైనా పొదుపు పథకాలలో ఇన్వెస్ట్ చెయ్యాలని అనుకుంటారు... ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ వల్ల ఏ ఒక్క ఉద్యోగికి కూడా నష్టం జరగదు. ఖాతాదారులందరి కి వారి వారి ఖాతాల్లో వడ్డీ జమ చేస్తుంది. కానీ కొన్నిసార్లు సాఫ్ట్వేర్ అప్గ్రేడ్ కారణంగా పాస్బుక్లో కనిపించదు. వాస్తవాని కి ఈపీఎఫ్వో తన ఖాతాదారుల కి ఈ-నామినేషన్ ను తప్పనిసరి చేసింది. ఇది చేయకుంటే పీఎఫ్ బ్యాలెన్స్ చెక్ చేసుకోలేరు. ఈ నామినేషన్ వల్ల ఖాతాదారుడి కుటుంబాని కి సామాజిక భద్రత లభిస్తుంది.
ఇందుకు సంబంధించి ఈపీఎఫ్ వో నిరంతరం హెచ్చరికలు జారీ చేస్తూనే ఉంది. ఈపీఎఫ్ వో తన సబ్స్క్రైబర్ లకు నామినీ సమాచారాన్ని తెలియజేయడానికి ఈ- నామినేషన్ సౌకర్యాన్ని కల్పిస్తోంది. ఆ తర్వాత నామినీ పేరు, పుట్టిన తేదీ వంటి ఆన్ లైన్ సమాచారం అప్డేట్ అవుతుంది. దీనివల్ల ఖాతాదారుడు మరణించిన సందర్భం లో పీఎఫ్, పెన్షన్ బీమా కి సంబంధించిన డబ్బును విత్డ్రా చేసుకోవడాని కి నామినీ/ కుటుంబ సభ్యుల కు ఇది సహాయపడుతుంది.
ఈపీఎఫ్ వో సభ్యులు ఎంప్లాయీ డిపాజిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ స్కీమ్ కింద బీమా రక్షణ సౌకర్యాన్ని పొందుతారు. పథకం లో నామినీ కి గరిష్టంగా రూ. 7 లక్షల బీమా కవరేజీ అందుతుంది. ఏదైనా నామినేషన్ లేకుండా సభ్యుడు మరణిస్తే దావా ను ప్రాసెస్ చేయడం లో ఇబ్బందులు ఎదురవుతాయి. కాబట్టి తప్పని సరిగా ఆన్లైన్లో నామినేషన్ ప్రక్రియ చేయండి. అంతేకాదు ఖాతాదారు లు ఒకటి కంటే ఎక్కువ మందిని నామినీలు గా చేయవచ్చు.. ఇక్కడ గుర్థుంచు కొవాల్సిన విషయం ఏంటంటే మొదటి నామినికి మాత్రమే డబ్బులు చెల్లిస్తారు. లేకుంటే తర్వాత వారికి.. ఈ విషయాన్ని తప్పక గుర్తుంచుకోవాలి.. ఇప్పుడు మంచి బెనిఫిట్స్ కూడా ఉన్నాయి..