ఉజ్వల యోజన పథకం గురించి ఈ విషయాలు తప్పక తెలుసుకోవాలి...

Satvika
మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నో సంక్షేమ పథకాల అందుబాటులోకి తీసుకొని వచ్చారు. ఇప్పటివరకు వున్న అన్నీ కూడా ప్రజలకు లబ్దిని చేకూరుస్తుంది.. ఇకపోతే ఈ మధ్య కాలంలో ఒక పథకానికి మరో పథకానికి సంబంధం వుండేది. ఈ మేరకు పేదలకు కేంద్ర ప్రభుత్వం ద్వారా ఎల్‌పీజీ కనెక్షన్లు అందించే పథకాన్ని కూడా అమలు చేస్తున్నారు. మోడీ ప్రభుత్వంలో దీని కోసం ప్రధాన మంత్రి ఉజ్వల యోజన ప్రారంభించారు. ఈ పథకాన్ని మే 2016లో పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వ శాఖ ‘ప్రధాన్ మంత్రి ఉజ్వల యోజన’ను గ్రామీణ, నిరుపేద కుటుంబాలకు ఎల్‌పీజీ వంటి స్వచ్ఛమైన వంట ఇంధనాన్ని అందించే లక్ష్యంతో ఒక ప్రధాన పథకంగా ప్రవేశపెట్టింది.

వంట ఇంధనాలైన కట్టెలు, బొగ్గు, ఆవు పేడ మొదలైన వాటి వాడకం గ్రామీణ మహిళల ఆరోగ్యంతో పాటు పర్యావరణంపై హానికరమైన ప్రభావాలను చూపుతుందనే ఉద్దేశంతో కేంద్రం ఈ పథకాన్ని అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ స్కీమ్‌ ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో ఎంతో మందికి గ్యాస్‌ కనెక్షన్‌ అందింది. పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వ శాఖ ద్వారా నిర్వహించబడుతున్న ప్రధాన మంత్రి ఉజ్వల యోజన కింద ఎల్‌పీజీ గ్యాస్‌ కనెక్షన్ బీపీఎల్‌ కుటుంబాలకు అందిస్తోంది.

ఈ పథకం కింద ప్రతి కనెక్షన్ గ్యాస్ స్టవ్ కొనుగోలు, సిలిండర్ రీఫిల్ కోసం వడ్డీ రహిత రుణం పొందేందుకు అర్హులు.ప్రధాన్ మంత్రి ఉజ్వల యోజన ప్రయోజనాన్ని పొందడానికి ప్రభుత్వం అనేక అర్హతలను విధించింది. ఈ స్కీమ్ ప్రయొజనాలు గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
ఈ పథకం అర్హతలు ఏమిటో తెలుసా?

*. భారతీయ పౌరురాలై ఉండాలి. వయస్సు 18 ఏళ్లు నిండి ఉండాలి.
*. ఎల్‌పీజీ కనెక్షన్ లేని, బీపీఎల్‌ కుటుంబానికి చెందిన మహిళ అయి ఉండాలి.
*. ఇతర పథకాల కింద కింద ఎలాంటి ప్రయోజనం పొంది ఉండకూడదు.అంతేకాదు బ్యాంకు ఖాతా ఉండాలి.
*. ఎస్సీ/ఎస్టీ కుటుంబాల కింద ఎస్‌ఈసీసీ 2011 లేదా బీపీఎల్‌ కుటుంబాల జాబితాలో చర్చిన లబ్ధిదారులు, పీఎంఏవై, ఏఏవై, అత్యంత వెనుకబడిన తరగతులు, అటవీ నివాసులు మొదలగు బడుగు జనాలు..
*.  ఈ లింక్‌పై క్లిక్ చేయడం ద్వారా మీరు దరఖాస్తు కోసం ఆన్‌లైన్ పోర్టల్‌కి వెళ్లవచ్చు. అందులో సూచించిన విధంగా వివరాలు నమోదు చేసి దరఖాస్తు చేసుకోవచ్చు. లేదా మీ సేవా కేంద్రాలకు కూడా వెళ్లి దరఖాస్తు చేసుకోవచ్చు..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: