మళ్ళీ ఏపీలో భారీ వర్షాలు..వాతావరణ శాఖ ఏం చెప్తుందంటే..?

Satvika
ఏపీలో గత కొన్ని రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే..గత కొన్ని రోజులుగా పడుతున్న వర్షాలకు భారీగా వరద నీరు వస్తున్న సంగతి తెలిసిందే..ఇప్పుడు మందూస్ తుఫాన్ వల్ల ఇంకా కురుస్తున్న వర్షాలకు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఇప్పుడు మరో తుఫాన్ కారణంగా చాలా మంది సర్వం కొల్పొయారు..ఇప్పుడు మరో తుఫాన్ హెచ్చరికను అధికారులు జారీ చేశారు. దాంతో జనాలు భయంతో వణికిపోతున్నారు...వర్షం టెన్షన్ ఇంకా జనాలను పీడిస్తుంది..

ఇటీవల మాండూస్ తుఫాన్ రాయలసీమతో పాటు నెల్లూరు, ప్రకాశం జిల్లాలను రఫ్పాడించింది. పంటలకు తీవ్ర స్థాయిలో నష్టం వాటిల్లింది.ఇప్పుడు మరోసారి రాష్ట్రంపై మరోసారి వరుణుడు దండెత్తనున్నాడంటూ వస్తున్న వార్తలపై అమరావతి వాతావరణ కేంద్రం క్లారిటీ ఇచ్చింది. ఆంధ్రప్రదేశ్, యానాంలలో దిగువ ట్రోపో ఆవరణములో ఈశాన్య /ఆగ్నేయ గాలులు వీస్తున్నాయని తెలిపింది. ఆగ్నేయ బంగాళాఖాతం & ఆనుకుని ఉన్న తూర్పు హిందూ మహాసముద్రం మీద ఉన్న అల్పపీడన ప్రాంతం కొనసాగుతున్నది..

ఇది క్రమంగా పశ్చిమ దిశగా కదులుతూ తదుపరి 12 గంటలలో అదే ప్రాంతం మీద తీవ్ర అల్పపీడన ప్రాంతంగా మారే అవకాశం ఉంది. ఆ తరువాత ఇది క్రమంగా పశ్చిమ దిశగా కదులుతూ 17 డిసెంబర్ ఉదయానికి దక్షిణ బంగాళాఖాతంలో దాని తీవ్రత కొనసాగిస్తుంది. అయితే దీని ప్రభావం ఏపీపై ఉండదని.. వచ్చే మూడు రోజుల పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వాతావరణం పొడిగా ఉంటుందని వెదర్ రిపార్ట్‌మెంట్ క్లారిటీ ఇచ్చింది.ఈరోజు, రేపు మరియు ఎల్లుండి :- పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది..ఒకసారి వర్షాల గురించి చూస్తే..ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ & యానాం లోఈరోజు, రేపు మరియు ఎల్లుండి.. పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది.రాయలసీమలో.. వచ్చే 5 రోజుల పాటు ఏపీలో ఎలాంటి వర్షాలు ఉండవని స్పష్టం చేశారు. ఫాల్స్ ఇన్ఫర్మేషన్ నమ్మొద్దని సూచించారు...ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అంటున్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: