దేశ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి.. గత కొన్ని రోజులుగా అల్పపీడన ప్రభావంతో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే..ఇప్పుడు వాతావరణ శాఖ 11 రాష్ట్రాల్లో వర్ష హెచ్చరికలు జారీ చేసింది.రానున్న మూడు రోజుల పాటు ఈ వర్షం ఇలాగే కొనసాగే అవకాశం ఐఎండీ తెలిపింది. ఐఎండీ తెలిపిన వివరాల ప్రకారం.. .గత కొన్ని రోజులుగా దేశంలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. జమ్మూ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, ఢిల్లీ-ఎన్సీఆర్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, రాజస్థాన్, ఒడిశా, పశ్చిమ బెంగాల్, జార్ఖండ్లోని కొన్ని ప్రాంతాల్లో రాబోయే కొద్ది రోజుల్లో వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ విభాగం అంచనా వేసింది.
సిక్కిం, మేఘాలయ, అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, పశ్చిమ బెంగాల్, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరి, కేరళ రాష్ట్రాల్లో ఆదివారంపిడుగులు పడే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.ఢిల్లీలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా ఉష్ణోగ్రతలు కూడా తగ్గుముఖం పట్టాయి. వర్షాల కారణంగా దేశ రాజధానిలోని కొన్ని ప్రాంతాల్లో నీరు నిలిచి ట్రాఫిక్ జామ్ల కారణంగా ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఢిల్లీలో గరిష్ట ఉష్ణోగ్రత 23.4 డిగ్రీల సెల్సియస్, సాధారణం కంటే 10 డిగ్రీలు తక్కువగా, కనిష్ట ఉష్ణోగ్రత 20.8 డిగ్రీల సెల్సియస్గా నమోదైంది.
అదే విధంగా..ఢిల్లీ ఆసుపత్రులలో ఎక్కువగా శ్వాసకోశ ఇన్ఫెక్షన్, టైఫాయిడ్, గ్యాస్ట్రోఎంటెరిటిస్ ఉన్న రోగుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. మూల్చంద్ ఆస్పత్రి శ్వాసకోశ నిపుణుడు డాక్టర్ భగవాన్ మంత్రి మాట్లాడుతూ.. ఈ రోజుల్లో శ్వాసకోశ ఇన్ఫెక్షన్లు, జ్వరం, టైఫాయిడ్, స్వైన్ ఫ్లూ, అలర్జీలు, న్యుమోనియా తదితర వ్యాధులతో సహా ఈ రోజుల్లో ఔట్ పేషెంట్ విభాగానికి (ఓపీడీ) 20 మందికి పైగా రోగులు వస్తున్నారు. డెంగ్యూ రోగులు కూడా పెరిగిపోతున్నారు..ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, తగు జాగ్రత్తలను పాటించాలని అధికారులు సూచిస్తున్నారు.