మహిళలపై సౌత్ కొరియన్ లైంగిక వేధింపులు?

Purushottham Vinay
కార్ల కీ తయారు చేసే కంపెనీలో మహిళ ఉద్యోగినులపై తరచూ లైంగిక వేధింపులకు పాల్పడుతున్న ఆ కంపెనీ డైరెక్టర్‌ కియాంగ్‌ జూ లీపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ ముఖ్యమంత్రి ప్రత్యేక విభాగానికి బాధితులు ఫిర్యాదు చేసిన ఘటన తమిళనాడులో బాగా కలకలం రేపింది.పూర్తి వివరాలలోకి వెళితే..తిరువళ్లూరు జిల్లా కడంబత్తూరు యూనియన్‌ తొడుగాడులో కార్లకు కీ తయారు చేసే కంపెనీ ఉంది. ఈ కంపెనీలో మొత్తం 300 మంది పని చేస్తున్నారు. కంపెనీ డైరెక్టర్‌గా సౌత్ కొరియా వాడైనా కియాంగ్‌ జూ లీ, ఇంకా హెచ్‌ఆర్‌గా రాము అనే వ్యక్తి పని చేస్తున్నారు. కంపెనీలో పనిచేసే యువతులకు డైరెక్టర్‌ కియాంగ్‌ జూ లీ, హెచ్‌ఆర్‌ రాము సాయంతో తరచూ లైగింక వేధింపులకు గురిచేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇదే విషయంపై బాధిత యువతులు మప్పేడు పోలీసులకు, మేనేజ్‌మెంట్‌కు గతంలో ఫిర్యాదు చేయగా పోలీసులు రాజీకుదిర్చినట్లు తెలిసింది.ఇక దీంతో కక్ష్యకట్టిన డైరెక్టర్‌ లీ, తనపై ఫిర్యాదు చేసిన వారిలో కొందరిని ఉద్యోగం నుంచి తొలగించాడు. మరికొందరిని అక్కడి నుంచి వేరే బ్రాంచీకి ట్రాన్స్ఫర్ చేసినట్లు తెలిసింది. పోలీసుల హెచ్చరికతో కొద్ది రోజులు మౌనంగా ఉన్న లీ, ఇటీవల వేధింపుల పర్వానికి తెరతీశాడు.


కంపెనీలో పనిచేసే యువతులతో అసభ్యకరంగా ప్రవర్తించడం, నేరుగా యువతులు నివాసం ఉండే రూమ్‌లకు వెళ్లి వేధింపులకు గురిచేయడం ప్రారంభించాడు. దీంతో వేధింపులు తాళలేక బాధిత యవతులు స్థానిక పోలీసులు, పంచాయతీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి ప్రత్యేక విభాగానికి ఫిర్యాదులు చేశారు.తమపై లైగింక వేధింపులకు గురిచేస్తున్న కియాంగ్‌ జూ లీపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.కంపెనీలో పనిచేసే 27 ఏళ్ల యువతిపై రెండు నెలల నుంచి లీ వేధింపుల ఎక్కువైనట్లు తెలిసింది. యువతి నివాసం ఉండే ప్రాంతానికి వెళ్లిన లీ తనతో సహాజీవనం చేయాలని, లేనిపక్షంలో ఉద్యోగం నుంచి బయటకు పంపుతానని బెదిరించినట్లు సమాచారం.


ఈ నేపథ్యంలో లీ బెదిరింపులపై యువతి కంపెనీ యాజమాన్యానికి ఫోన్‌ ద్వారా చేసిన ఫిర్యాదు ఆడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది. "నాకు త్వరలోనే వివాహం కానుంది. ఈ సమయంలో లీ వేధింపులు ఎక్కువయ్యాయి. ఇంటికి వచ్చి మరీ వేధింపులకు గురి చేస్తున్నాడు. ఇదే పరిస్థితి కొనసాగితే ఆత్మహత్య తప్ప మరో మార్గం లేదని' యువతి యాజమాన్యంతో మాట్లాడిన ఆడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్‌గా మారింది.


మరి ఎవరో పరాయి దేశం వాడు అది కూడా సౌత్ కొరియ లాంటి పిల్ల కూన దేశం వాడు ఎంతో చరిత్ర వున్న మన దేశానికి బ్రతుకు తెరువు కోసం వచ్చి ఈ రకంగా చాలా ధైర్యంగా మన మహిళలను ఇబ్బంది పెడుతున్నాడంటే మన దేశ దౌర్భాగ్య స్థితి ఏంటో పూర్తిగా అర్ధమవుతుంది.అదే పరాయి దేశంలో మన వాళ్ళు ఇలా చేస్తే వాళ్ళు ఊరుకుంటారా.. కుక్కను కాల్చినట్టు కాల్చేస్తారు. సో అలా వుంది మన దేశ దుర్గతి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: