మోడీని ఏపీకి ప్రత్యేక హోదా కోరిన జగన్!

Purushottham Vinay
ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా (Special Status ) ఇవ్వాలని ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి వినతి పత్రం సమర్పించారు. పశ్చిమ గోదావరి జిల్లాలో అల్లూరి కాంస్య విగ్రహావిష్కరణ సభలో పాల్గొని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ తిరుగు ప్రయాణమయ్యే సమయంలో గన్నవరం ఎయిర్ పోర్టులో ప్రధాని మోడీకి ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వినతి పత్రం సమర్పించారు.విభజనతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పూర్తిగా దెబ్బతిందని జగన్ మోహన్ రెడ్డి చెప్పారు. ఈ విభజనతో దెబ్బతిన్న ఏపీ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చి ఆదుకోవాలని ఆ వినతి పత్రంలో ఆయన కోరారు. ఇంకా అలాగే మరో వైపు పోలవరం ప్రాజెక్టు అంశాన్ని కూడా జగన్ మోహన్ రెడ్డి ఈ వినతి పత్రంలో ప్రస్తావించారు. ఈ పోలవరం ప్రాజెక్టుకు సవరించిన అంచనాల మేరకు మొత్తం రూ. 55,548.87 కోట్లకు ఆమోదం తెలిపిందని కూడా ఆయన గుర్తు చేశారు.ఈ నిధులను అందించాలని ప్రధానిని సీఎం జగన్ మోహన్ రెడ్డి కోరారు.


ఇక అంతేకాకుండా తెలంగాణ రాష్ట్రంలోని విద్యుత్ సంస్థల నుండి కూడా ఏపీ రాష్ట్రానికి రావాల్సిన విద్యుత్ బకాయిలను వచ్చేలా చూడాలని కూడా ఆయన కోరారు. ఇంకా అలాగే తెలంగాణ రాష్ట్రం నుండి ఏపీ విద్యుత్ సంస్థలకు మొత్తం రూ.6,627.28 కోట్లు చెల్లించాల్సి ఉందని ఏపీ ప్రభుత్వం చెబుతుంది. ఇంకా అలాగే రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేస్తున్న వైద్య కళాశాలకు ఆర్ధిక సహాయం చేయాలని జగన్ మోహన్ రెడ్డి ఆ వినతి పత్రంలో కోరారు.ఇంకా భోగాపురం ఎయిర్ పోర్టుకు అన్ని రకాల క్లియరెన్స్ లను కూడా ఇవ్వాలని ఆయన కోరారు.అలాగే ఏపీఎండీసీకి ఇనుప ఖనిజం గనులను కేటాయించాలని కోరారు. ఇంకా రీసోర్స్ గ్యాప్ కింద రాష్ట్రానికి మొత్తం 34,125.5 కోట్లు ఇవ్వాలని సీఎం జగన్ మోహన్ రెడ్డి కోరారు.జాతీయ ఆహార భద్రత చట్టం కింద రేషన్ సరఫరా విషయంలో కూడా తమ రాష్ట్రానికి న్యాయం చేసేలా చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ జగన్ మోహన్ రెడ్డి కోరడం జరిగింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: