జగన్ కొత్త పథకం : ఏపీలో జగనన్న స్పోర్ట్స్ క్లబ్బులు!

Purushottham Vinay
ఇక తాజాగా మరో కొత్త పథకానికి జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఇప్పుడు ఇక జగనన్న స్పోర్ట్స్ క్లబ్బులు అనేవి రాబోతున్నాయి.ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రామస్థాయి నుంచి క్రీడలను క్రీడాకారులను ప్రోత్సహించడానికి జగన్ ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతోంది. ప్రతిభ గల క్రీడాకారులను గుర్తించడంతో పాటు వారిని వెలుగులోకి తీసుకురావడానికి 'జగనన్న స్పోర్ట్స్ క్లబ్'ల పేరిట క్రీడాభివృద్ధికి శ్రీకారం చుట్టడం జరిగింది.అలాగే క్రీడలపై అవగాహన పెంపొందించేలా సచివాలయ ఉద్యోగుల్లో ఒకరికి ప్రత్యేక జాబ్ చార్ట్ ను కేటాయిస్తూ ఈ మేరకు తాజాగా మార్గదర్శకాలు కూడా జారీ చేయడం జరిగింది. ప్రతి నెలా కూడా క్రమం తప్పకుండా ముఖ్యమైన తేదీల్లో గ్రామాల్లోనే పోటీలు నిర్వహించేలా ప్రణాళికలు కూడా రూపొందించింది. స్థానిక పాఠశాలలు కళాశాలల్లోని పీడీ పీఈటీలకు కోఆర్డినేటర్లుగా కూడా బాధ్యతలు అప్పగించింది.ఇక మొత్తం ఒక్కో గ్రామంలో 25 క్రీడాంశాలకు పైబడి క్లబ్బులను ఏర్పాటు చేసేందుకు జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం వీలు కల్పిస్తోంది. ఇందులో ఒక్కో క్రీడకు ఒక్కో క్లబ్ ఏర్పాటు చేసుకోవచ్చు. ప్రతి స్పోర్ట్స్ క్లబ్బుకు కూడా అధ్యక్షులు కార్యదర్శులు కోశాధికారి పాలకమండలి సభ్యులు ఉంటారు.


ఇక మూడునెలలకు ఒకసారి మండల నియోజకవర్గ జిల్లాస్థాయిల్లో స్పోర్ట్స్ క్లబ్బుల తరఫున పోటీలు అనేవి నిర్వహిస్తారు. అలాగే ఇందుకోసం శాప్ అధికారులు ప్రత్యేక యాప్ ను కూడా తెచ్చే యోచనలో ఉన్నారు. ఇక ఈ యాప్ ద్వారా స్పోర్ట్స్ క్లబ్బుల రిజిస్ట్రేషన్ను చేయనున్నారు.ఇక కేవలం గ్రామాలే కాకుండా అక్కడ ఉండే ప్రభుత్వ ప్రైవేటు స్కూళ్లు కళాశాలల్లో కూడా ఈ స్పోర్ట్స్ క్లబ్బులు ఏర్పాటు చేస్తారు.ఇంకా ఆయా గ్రామాల సర్పంచ్లు ఎంపీటీసీ సభ్యులు ఎంపీపీ జెడ్పీటీసీ సభ్యులు స్థానిక ఎమ్మెల్యేల సహకారంతో నిధులు సమకూర్చుకుంటూ ఈ క్లబ్బులు తమ కార్యకలాపాలు కొనసాగిస్తాయని కూడా ప్రభుత్వం చెబుతోంది.అలాగే సర్పంచ్ చైర్మన్ గా ఉండే గ్రామ స్పోర్ట్స్ క్లబ్బులో పంచాయతీ సెక్రటరీ గ్రామానికి చెందిన జిల్లాస్థాయి క్రీడాకారుడు లేదా క్రీడాభివృద్ధికి ముందుకు వచ్చే దాత స్థానిక హైస్కూల్ పీఈటీ సభ్యులుగా కూడా ఉంటారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: