Flipkart : 40 లక్షలకు టోపీ పెట్టిన కేటుగాళ్ళు!

Purushottham Vinay
ఇక ఈ రోజుల్లో అక్రమాలు చాలా అవలీలగా జరుగుతున్నాయి. ఒకప్పుడు చదువుకోని వాళ్లు బాగా మోసపోయేవాళ్లు. కాని ఇప్పుడలా కాదు, మంచి ఎడ్యుకేటెడ్ పర్సన్స్ కూడా కేటుగాళ్ల మాయలో పడి బాగా మోసపోతున్నారు.ఇక తాజాగా ప్రముఖ ఈ కామర్స్ సంస్థ అయిన ఫ్లిప్‌కార్ట్ ని నలుగురు మోసగాళ్లు రూ. 40 లక్షల రూపాయల వరకు మోసం చేశారు. ఈ విషయం ఇప్పుడు అంతటా కూడా పెద్ద చర్చనీయాంశంగా మారింది.ఇక పూర్తి వివరాలలోకి వెళితే రాహుల్ సింహ్ ఇంకా అలాగే దిలీప్ స్వామి ఉరఫ్ మాహీ శర్మ ఇద్దరూ కూడా జైపూర్ వాసులే. అక్కడే అజయ్ కాంత్ ఇంకా అలాగే సునీల్ నాయక్ అనే వాళ్లు కూడా వీళ్లకు జతకలిశారు. ఇక వీళ్లలో దిలీప్ స్వామి వివిధ నెంబర్లతో ఫ్లిప్‌కార్ట్ అకౌంట్లు తీసుకున్నాడు. వాటితో ఐఫోన్లు ఆర్డర్ చేసి ఇక ముందుగానే డబ్బులు కూడా చెల్లించేవాడు.ఇక డెలివరీకి వచ్చిన సమయంలో డెలివరీ బాయ్‌ను కూడా కూడా బుట్టలో వేసేవాళ్లు ఈ కేటుగాళ్లు.ఆ డెలివరీ బాయ్‌కు రూ.4 వేలు లేదా ఐదు వేల రూపాయలు ఇచ్చి రెండు గంటల తర్వాత రమ్మనేవాళ్లు.


అతను అలా వచ్చేటప్పటికి కూడా అసలు మొబైల్ స్థానంలో నకిలీ ఫోన్ పెట్టేసి రిటర్న్ చేసేవాళ్లు. ఇక దాన్ని అందుకున్న ఆ డెలివరీ బాయ్.. ఆర్డర్ క్యాన్సిల్ అయినట్లు కంపెనీకి మెసేజ్ చేసేవాడు. దాంతో రెండు ఇంకా మూడు రోజుల్లోనే దిలీప్ డబ్బులు రిటర్న్ వచ్చేసేవి.తిరిగొచ్చిన మొబైల్‌ ఫోన్ లో లోపం ఏంటో చూసేందుకు ప్రయత్నించిన ఆ కంపెనీ బాక్సులో ఉన్న నకిలీ ఫోన్ చూసి ఆశ్చర్యపోయింది. దీంతో అసలు విషయం గ్రహించి పోలీసులకు సమాచారం కూడా అందించారు. రంగంలోకి దిగిన పోలీసులు నిందుతులు నలుగురినీ అదుపులోకి తీసుకొని విచారణను చేశారు.ఇక ఈ విచారణలో తాము ఇప్పటి వరకు 30 నుంచి 40 సార్లు ఇలా మోసాలు చేసినట్లు కూడా వాళ్లు అంగీకరించారు. ప్రస్తుతం ఇంకా దర్యాప్తు కొనసాగుతోందని కూడా పోలీసులు చెప్పారు. రూ.40లక్షల వరకు ఫ్లిప్‌కార్ట్‌కి టోపి పెట్టినట్టు సమాచారం తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: