రానున్న రెండు రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..

Satvika
ఇన్ని రోజులు వేడితో సతమతమవుతున్న జనాలకు సేద తీరే ఛాన్స్ వచ్చింది.దేశంలో పలు చోట్ల వర్షాలు కురుస్తున్నాయి.ఇప్పటికే పలు చోట్ల కురిసిన భారీ వర్షాలకు వరదలు రావడంతో జనాలు అనేక ఇబ్బంధులను ఎదుర్కొంటున్నారు.. నైరుతి రుతుపవనాలు ఇప్పటికే అండమాన్ నికోబార్ దీవులకు చేరుకున్నాయి. బంగాళాఖాతం లో నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి.మరో వారంలో రుతుపవనాలు కేరళను తాకే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. నైరుతి రుతుపవనాల ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి.


 తెలంగాణ రాష్ట్రానికి కూడా నైరుతి రుతుపవనాలు ముందుగానే రానున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది..తెలంగాణాలో వర్ష సూచన భారీగా ఉందని తెలుస్తుంది..జూన్ 5 నుంచి జూన్ 10లోపు ప్రవేశించే అవకాశం ఉందని తెలిపింది. తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో ఈ నెల 21వ తేదీ వరకు తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని స్థానిక వాతావరణ కేంద్రాలు వెల్లడించాయి.రానున్న రెండు రోజుల్లో రాష్ట్రంలో జల్లుల నుంచి భారీగా వర్షాలు కురిసే అవకాశం ఉందని నిపునులు చెబుతున్నారు.


తమిళనాడు, పరిసర ప్రాంతాల లో ఉపరితల ఆవర్తనం 3.1 కి.మీ నుంచి 7.6 కి.మీ ఎత్తు మధ్య కొనసాగుతోంది. ఇది నైరుతి దిశగా వంగి ఉంది. మధ్యప్రదేశ్ నుంచి తమిళనా డు వరకు ఉత్తర దక్షిణ ద్రోణి మరఠ్వాడా కర్ణాటక మీదగా సముద్రమట్టాలనికి 1.5కి.మీ ఎత్తులో విస్తరించి కొనసాగుతోంది. దీని ఫలితంగా ఏపీలో రాగల రెండు రోజుల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. ఉత్తర, దక్షిణ కోస్తా, రాయలసీమ లో రాగల రెండు రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉందని పేర్కొంది. కొన్ని చోట్ల ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని వెల్లడించింది.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: