అసలు జగన్ కి ఇలాంటి ఆలోచనలు ఎలా వస్తాయి.?
సీజన్ ముందుగా మొదలైతే లాభం ఏంటి..?
సీజన్ ముందుగా మొదలవ్వాలంటే ముందు సాగునీరు అందించాలి. ప్రస్తుతం ఏపీలో ప్రభుత్వానికి ఆ అవకాశం ఉంది. దీంతో గోదావరి డెల్టా ఆయకట్టుకు జూన్ 1 నుంచి సాగునీరు అందజేస్తామని ప్రకటించింది ప్రభుత్వం. ఇక పులిచింతల విషయంలో కూడా ముందస్తు ప్రణాళికలు వర్కవుట్ అవుతాయి. పులిచింతల ప్రాజెక్ట్ లో 36 టీఎంసీల నీళ్లు ఉన్నాయి. ఈ నీటిని ప్రకాశం బ్యారేజికి ముందు విడుదల చేస్తారు. ఆ తర్వాత కృష్ణా ఆయకట్టుకు జూన్ 10 నుంచి సాగునీరు పంపిణీ మొదలవుతుంది. అంటే పట్టిసీమ ప్రాజెక్ట్ అవసరం లేకుండానే ఈసారి ముందుగానే సాగునీరు విడుదల చేస్తారనమాట. ఇక సాగర్ జలాలపై ఆధారపడిన రైతులకు జులై 15నుంచి నీరు విడుదల చేస్తారు. సోమశిల ప్రాజెక్ట్ నుంచి జులై 10న నీళ్లు విడుదల చేస్తారు. సోమశిల గరిష్ట నీటిమట్టం 72 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 56 టీఎంసీల నీటి నిల్వ ఉంది.
సీజన్ ముందుగా మొదలైతే.. చివర్లో వచ్చే తుపానులు, అల్ప పీడన ప్రభావంతో పడే అకాల వర్షాలనుంచి రైతులు తప్పించుకోవచ్చు. అంటే పంట నష్టాన్ని కనిష్టానికి చేరవేయొచ్చనమాట. ఖరీఫ్ ముందుగానే మొదలైతే 3 పంటలు సాగు చేసేందుకు కూడా అవకాశముంటుంది. మూడో పంటలో పంట మార్పిడికి కూడా ఛాన్స్ ఉంటుంది. వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకుని వైసీపీ ప్రభుత్వం ఖరీఫ్ ని కాస్త ముందుకు జరిపేందుకు నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే ఉత్తరాంధ్రలో కొన్ని ప్రాంతాల రైతులు ఈ తరహా ప్రయోగాలు చేస్తున్నారు. ఇప్పుడు ప్రభుత్వం నేరుగా ఇలాంటి నిర్ణయం తీసుకుంది.