వంట నూనెల ధరలపై కేంద్రం గుడ్ న్యూస్!

Purushottham Vinay
ఇక ప్రస్తుతం దేశంలో అవసరాలకు సరిపడా వంటనూనెలు అందుబాటులో ఉన్నయాని కేంద్ర ప్రభుత్వం ఆదివారం నాడు వెల్లడించింది. వంటనూనెల ధరలను ఇంకా దిగుమతుల రవాణా పరిస్థితులను కేంద్ర ప్రభుత్వం పర్యవేక్షిస్తున్నట్లు వెల్లడించింది. ప్రజలు విషయంలో ఆందోళన చెందాల్సిన అవసరం కూడా లేదని తెలిపింది. ఇక ఆయిల్ పరిశ్రమలు అందించిన వివరాల ప్రకారం దేశంలో ప్రస్తుతం 21 లక్షల టన్నుల వంట నూనెలు అనేవి అందుబాటులో ఉండగా.. అలాగే మరో 12 లక్షల టన్నుల నూనెలు రవాణాలో ఉన్నాయని తెలిపింది. రవాణాలో ఉన్న వంటనూనెలు మే నెలలో దేశ అవసరాలకు అందుబాటులోకి వస్తాయని వినియోగదారుల మంత్రిత్వశాఖ తెలిపింది. ఇండోనేషియా పామాయిల్ ఎగుమతులను నిరోధించటం వల్ల ఇండియాపై ఎలాంటి ప్రభావం ఉండదని.. అందుకు అవసరమైన వంట నూనె నిల్వలు దేశంలో అందరికి అందుబాటులో ఉన్నాయని తెలిపింది.నూనె గింజల ఉత్పత్తికి సంబంధించిన వివరాలు కనుక చూస్తే 2021-22 సంవత్సరంలో సోయాబీన్ ఉత్పత్తి ఉత్తమ స్థాయిలో ఉందట. ఇక గత సంవత్సరం కంటే ఎక్కువగా 126.10 లక్షల టన్నులుగా ఇవి ఉన్నట్లు నివేదిక ప్రకారం సమాచారం తెలిసింది.


అలాగే మరో పక్క ఆవాల నూనె ఉత్పత్తి కూడా 114 లక్షల టన్నులుగా ఉండనుందని సమాచారం తెలుస్తోంది. ఇందుకోసం దేశంలో 37 శాతం అధికంగా పంటని వేశారు. ఇక ఈ తరుణంలో పౌర సరఫరాల శాఖ వంట నూనెల ధరలను ఎప్పటికప్పుడు కూడా పర్యవేక్షిస్తోంది.అందువల్ల వినియోగదారులపై ధరల భారాన్ని తగ్గించేందుకు ప్రయత్నాలను కూడా ముమ్మరం చేస్తోంది. ఇదే సమయంలో ఇండోనేషియా ఇంకా అలాగే మలేషియా నుంచి పామాయిల్ దిగుమతి 62 శాతం,అర్జెంటీనా ఇంకా అలాగే బ్రెజిల్ నుంచి సోయాబీన్ ఆయిల్ దిగుమతి 22 శాతం, ఉక్రెయిన్ ఇంకా అలాగే రష్యాల నుంచి సన్ ఫ్లవర్ ఆయిల్ 15 శాతంగా ఉన్నాయి.అంతర్జాతీయంగా తక్కువ ఉత్పత్తి ఇంకా అలాగే ఎగుమతులపై ఉత్పత్తి దేశాల అధిక పన్నులతో పాటు ఇతర కారణాలు వంటనూనెల ధరలపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.ప్రపంచంలో భారత్ నూనె గింజల తయారీలో అగ్రగామిగా ఉంటూ 2021-22 సంవత్సరంలో 37.14 మిలియన్ టన్నుల గింజలను పండించడం జరిగింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: