ఈసారి రాయలసీమపై కన్నేసిన పవన్ కళ్యాణ్!

Purushottham Vinay
ఈసారి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రాయలసీమ పై తన దృష్టి పెట్టాడు.2019 ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ రెండు చోట్ల పోటీ చేశారు. విశాఖలోని గాజువాక పశ్చిమ గోదావరి జిల్లాలోని భీమవరం నుంచి ఆయన బరిలో దిగారు. కానీ సీఎం జగన్ గాలిని తట్టుకోలేక రెండు చోట్లా కూడా పరాజయం పాలయ్యారు. ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే నియోజకవర్గాన్ని మార్చాలనే ఆలోచనతో పవన్ కళ్యాణ్ ఉన్నారు.ఒక్క స్థానంలోనే పోటీ చేయాలనుకుంటున్నారని సమాచారం తెలుస్తుంది. అందుకే కాకినాడ రూరల్ లేదా పిఠాపురం స్థానాలపై కన్నేశారని సమాచారం వచ్చింది. అక్కడైతే కాపు సామాజిక వర్గం చాలా బలంగా మారుతుందని ఆయన భావిస్తున్నట్లు సమాచారం తెలుస్తుంది.ఇక ఇప్పుడేమో తాజాగా పవన్ కళ్యాణ్ రాయలసీమ నుంచి పోటీ చేస్తారనే ప్రచారం మొదలైంది. గత ఎన్నికల్లో ఆయన రాయలసీమ నుంచి పోటీ చేయాలని అనుకున్నప్పటికీ జగన్ మోహన్ రెడ్డి వేవ్ కి వెనక్కి తగ్గాల్సి వచ్చింది. కానీ ఈ సారి అలాంటి పరిస్థితి ఉండదని సమాచారం. 


ప్రజల్లో వ్యతిరేకత కారణంగా జగన్ గాలి తగ్గుతుందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. దీంతో వచ్చే ఎన్నికల్లో తిరుపతి నుంచి పోటీ చేయాలని భావిస్తున్నట్లు సమాచారం తెలుస్తోంది.టీడీపీతో పొత్తు పెట్టుకుంటే ఆయన తిరుపతి నుంచి బరిలో దిగే ఛాన్స్ లు ఎక్కువగా ఉన్నాయని విశ్లేషకులు చెబుతున్నారు. అక్కడ జగన్ పార్టీకి అంతగా బలం లేదు. గత ఎన్నికల్లో కూడా ఆ పార్టీకి అతి తక్కువ మెజారిటీ వచ్చిన సీటు ఇదే.దీంతో పవన్ కళ్యాణ్ బరిలో దిగితే గెలుపు సాధ్యమేనన్న అంచనాలున్నాయి. పైగా తన సామాజిక వర్గం అండగా నిలుస్తుందని పవన్ కళ్యాణ్ భావిస్తున్నారు. మరోవైపు గతంలో ప్రజారాజ్యం పార్టీ తరపున తన అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి ఇక్కడి నుంచి విజయం సాధించారు. ఆ సెంటిమెంట్ కూడా కలిసొస్తుందన్నది పవన్ కళ్యాణ్ ఆలోచనగా తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: