వ్యాక్సినేషన్ విషయంలో ఏపీకి అరుదైన ఘనత..!
మరోవైపు త్వరలోనే 15ఏళ్లలోపు పిల్లలకు కరోనా టీకా కార్యక్రమం చేపడతామని కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేశ్ భూషణ్ తెలిపారు. ఈ ప్రక్రియ గురించి సైంటిఫిక్ డేటా రాగానే నిర్ణయం తీసుకుంటామని పేర్కొన్నారు. ప్రస్తుతం 15 నుండి 18ఏళ్ల వారికి వ్యాక్సిన్ ఇస్తున్నట్టు చెప్పారు. అటు థర్డ్ వేవ్ లో మృతుల సంఖ్య తక్కువగా ఉన్నా నిర్లక్ష్యం వహించొద్దని సూచించారు. కొన్ని రాష్ట్రల్లో వైరస్ వ్యాప్తి అధికంగా ఉందని తెలిపారు.
ఇక ఏపీలో గత 24గంటల్లో కొత్తగా 12వేల 615 కరోనా కేసులు నమోదయ్యాయి. నిన్నటి కేసులతో పోలిస్తే భారీగా పెరిగాయి. మరోవైపు కోవిడ్ వల్ల ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. బుధవారం 3వేల 674 మంది కరోనా నుంచి కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 53వేల 871 యాక్టివ్ కేసులున్నాయి.
ఇదిలా ఉంటే ఏపీలో కరోనా కేసులు పెరుగుతున్న కారణంగా స్కూళ్లు మూసివేయాలన్న డిమాండ్ పై మంత్రి ఆదిమూలపు సురేష్ స్పందించారు. కరోనా కేసులు పెరుగుతున్నా.. తీవ్రత అంతగా లేదు. స్కూళ్లకు సెలవులు ఇచ్చే ఆలోచన లేదు. పిల్లలకు కరోనా సేకితో ఆ స్కూలు మూసివేసి తర్వాత ప్రారంభిస్తామన్నారు. కొన్ని యూనివర్సిటీలు పరీక్షలు కూడా నిర్వహిస్తున్నాయన్నారు మంత్రి ఆదిమూలపు సురేష్.