సీఎం కేసీఆర్.. ఏక్ నిరంజన్ అయిపోయాడు !

Veldandi Saikiran
సీఎం కేసీఆర్‌ పై మరోమారు రెచ్చిపోయారు బండి సంజయ్. రాష్ట్ర వ్యాప్తంగా బిజేపి పార్టీ  జిల్లా స్థాయి శిక్షణ తరగతులు జరుగుతున్నాయని.. ఫామ్ హౌస్ లో ఉన్న కేసీఆర్ లు తెలియచేయడానికి మీడియా ద్వారా తెలిపాలని చురకలు అంటించారు బండి సంజయ్.  రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అర్ధరాత్రి చేస్తున్న నిర్ణయాల వల్ల రాష్ట్ర లో ఉద్యోగులు ఇబ్బందులు పడుతున్నారని..  ఏక్ నిరంజన్ ల నిర్ణయం తీసుకుంటున్నాడని ఓ రేంజ్‌ లో రెచ్చి పోయారు బండి సంజయ్. రాష్ట్ర ముఖ్యమంత్రి బరిదేగించి ఉన్నాడు తుగ్లక్ లాగా నిర్ణయాలు తీసుకుంటున్నారు.రాష్ట్రపతి ఇచ్చిన జి ఓ ను 36 నెలల లోపట పూర్తి చేయకుండా ఫామ్ హౌస్ లో ఉండి ఉద్యోగుల పట్ల నిర్లక్ష్యం వహించారని ఫైర్ అయ్యారు బండి సంజయ్.

 ఉద్యోగస్తులకు గోస పట్టుకుంటున్న ముఖ్యమంత్రి కేసీఆర్. దుర్మార్గం ఐన ఆలోచనతో ఉద్యోగస్తులు గందరగోళం శృష్టించి బదిలీ లు కూడా వెంటనే జాయిన్ కావాలని ఆదేశాలు జరిచేయటం వల్ల వారి కుటుంబం చిన్న బిన్నం అవుతుందన్నారు బండి సంజయ్..రైతుల సమస్యలు లేకుండానే కావాలని ఆ విషయం తీసుకువచ్చారని... బాయిల్డ్ రైస్ లో ఒప్పొందం కుదుర్చుకొని బలవంతంగా రపించరని ఆరోపణలు చేయడం హాస్యాస్పదమన్నారు బండి సంజయ్‌. ధాన్యం కొనుగోలు విషయం లో రాజకీయం చేస్తున్నారు ముఖ్యమంత్రి కేసీఆర్.

ఉద్యోగుల సమస్యలు,నిరుద్యోగ సమస్య లను పక్కదారి పట్టేందుకు వరి విషయం తీసుకువచ్చారని చురకలు అంటించారు  బండి సంజయ్‌. పార్లమెంట్ లో ఆందోళన చేస్తున్న  ఆందోళన టీఆర్ఎస్ వాళ్ళు ఎందుకు చేశారో వారికి తెలియదు. ప్రయతమ ప్రధాని మోడీ పై ప్రజలకు నమ్మకం ఉంది తప్పకుండా ప్రజలు బుద్ధి చెప్తారు అని తెలిపారన్నారు  బండి సంజయ్‌. స్థానికత ఆధారంగా 90 శాతం ఉండాలని చెప్పారు కానీ ఎలా చేశారో చెప్పాలని డిమాండ్ చేశారని.. అనారోగ్యం తో ఉన్న ఉద్యోగస్తులకు ఇబ్బందులు పట్టించుకోవడం లేదని ఫైర్ అయ్యారు  బండి సంజయ్‌..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: