బీజేపీ ఖాతాలో ఉత్తరాఖండ్ చేరుతుందా...!
ఇక ఉత్తరాఖండ్ రాష్ట్ర బాధ్యతను స్వయంగా ప్రధాని నరేంద్ర మోదీ పర్యవేక్షిస్తున్నారు. ఇప్పటికే పలుమార్లు ఆ రాష్ట్రంలో పర్యటించిన మోదీ.. వచ్చే నెల నుంచి ఎన్నికల ప్రచారం ప్రారంభించనున్నారు. ఇదే విషయాన్ని కేంద్ర మంత్రి, బీజేపీ ఉత్తరాఖండ్ ఇంఛార్జ్ ప్రహ్లాద్ జోషీ వెల్లడించారు. డిసెంబర్ మొదటి వారం నుంచి మోదీ ఎన్నికల ప్రచారం ఉంటుందన్నారు. టూర్ షెడ్యూల్పై ఇప్పటికే బీజేపీ అగ్రనేతలు కసరత్తు చేస్తున్నట్లు వివరించారు. మోదీ పర్యటనలో బహిరంగ సభలతో పాటు, పార్టీ కార్యక్రమాలు కూడా ఉంటాయన్నారు. డెహ్రాడూన్లో పార్టీ నేతలు, కార్యకర్తలతో రెండు రోజుల పాటు సమావేశం ఉంటుందన్నారు. ఉత్తరాఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో వ్యవహరించాల్సిన వ్యూహాలపై మోదీ పార్టీ నేతలకు దిశా నిర్దేశం చేస్తారని వివరించారు ప్రహ్లాద్ జోషి. ఉత్తరాఖండ్ అసెంబ్లీలో మెజారిటీ సీట్లను బీజేపీ గెలుచుకుంటుందని జోషి ధీమా వ్యక్తం చేశారు. ఓటర్లను ఆకట్టుకునేందుకు కమలం పార్టీ నేతలు ఇప్పటి నుంచి భారీ ప్లాన్ వేశారు.