కెసిఆర్ పార్టీని ఆహ్వానించిన సజ్జల, చంద్రబాబు, కేసీఆర్ అండర్ స్టాండింగ్ తెలీదు అంటూ...!

Gullapally Rajesh
చంద్రబాబు వారం రోజులుగా భూతు అజెండాతో డ్రామాలు అడుతున్నాడు అని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి మండిపడ్డారు. జాతీయ స్థాయిలో ఉనికి కోసం భూతు అజెండాతోనే ఢిల్లీ వెళ్ళాడు అని ఆయన అన్నారు. బంద్ అన్నాడు.. దీక్ష అన్నాడు.. ఢిల్లీ టూర్ వెళ్ళాడు.. ఏది వర్క్ ఔట్ అవ్వలేదు అని ఎద్దేవా చేసారు. డ్రగ్స్, గంజాయి అంటూ తన బ్యాచ్ తో సొంత స్క్రిప్ట్ ని పదే పదే చెప్పిస్తున్నాడు అని ఢిల్లీ వెళ్లి ఏదో చేసేస్తానని చంద్రబాబు బిల్డప్ ఇచ్చాడు అని మండిపడ్డారు.
చివరికి అమిత్ షా అపాయిట్మెంట్ కూడా ఇవ్వలేదు అన్నారు ఆయన. ఈరోజు అమిత్ షా ఫోన్ చేసి కలవలేకపోయానని అన్నారట.. డ్రగ్స్, గంజాయి పై విచారణ చేయిస్తానని చెప్పారట అంటూ ఎద్దేవా చేసారు. అవసరం అయితే 6 నెలల్లో రాష్ట్రపతి పాలన పెడతానని హామీ ఇచ్చారు అని కూడా డ్రామాలు క్రియేట్ చేస్తారు అన్నారు. చంద్రబాబు ఢిల్లీలో చక్రాలు తిప్పే సీన్ లేదు.. దీపావళి విష్ణు చక్రం తిప్పాలి అంటూ ఎద్దేవా చేసారు. ఏపీ డ్రగ్స్ రాజధాని అంటూ బాధ్యత లేకుండా రాష్ట్రం పరువు తీస్తున్నాడు అని మండిపడ్డారు.
రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బతిస్తున్న చంద్రబాబుకి ఎంత కఠిన శిక్ష వేసినా తప్పులేదు అని అన్నారు. రాష్ట్ర ప్రతిష్ఠ పై చంద్రబాబు చేస్తున్నది ఉగ్రవాదం కంటే ఎక్కువ అని అన్నారు ఆయన. భూతులు తిట్టినవాడు ఎక్కడికో పోయాడు.. డ్రామాలు ఆడినవాడు హైదరాబాద్ పోయాడు అని 2017 లో అప్పటి టీడీపీ మంత్రులు అయ్యన్న, గంటా విశాఖ ప్రాంతంలో గంజాయి సాగు జరుగుతుందని చెప్పారు అని ఆయన ప్రస్తావించారు. 2017 లో టీడీపీ అధికారంలో ఉంది అప్పుడు పవన్ కళ్యాణ్ ఎందుకు మాట్లాడలేదు అని ఆయన ప్రశ్నించారు. ఏపీలో కేసీఆర్ పార్టీ పెట్టుకోవచ్చు దానికి ఎవరి అనుమతి అవసరం లేదు.. ఇండియాలో ఎక్కడైనా పెట్టుకొచ్చు అని అన్నారు. కేసీఆర్ ఏదో అంటాడు.. చంద్రబాబు ఏదో అంటాడు అని చంద్రబాబు కేసీఆర్ కి ఏమి అండర్ స్టాండింగ్ ఉన్నాయో తెలియదని ఆయన షాకింగ్ కామెంట్స్ చేసారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: