విద్యుత్ పరిస్థితిపై సీఎం జగన్ సమీక్ష...!
ధర్మల్ విద్యుత్ కేంద్రాలకు అవసరమైన బొగ్గు కొనుగోలుకు వెంటనే చర్యలు చేపట్టాలని ఆదేశించారు సీఎం జగన్. బొగ్గు కొనుగోలు కోసం అవసరమైన నిధులను కూడా వెంటనే విడుదల చేస్తామని సూచించారు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి. ప్రస్తుతం ఉన్న ధర్మల్ విద్యుత్ కేంద్రాల్లో ఉత్పత్తిని పూర్తిస్థాయిలో పెంచాలని కూడా ఆదేశించారు జగన్. రాష్ట్రంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా విద్యుత్ కోతలు ఉండకూడదని స్పష్టమైన సూచన చేశారు సీఎం జగన్. బొగ్గు సరఫరా చేసే ఏజెన్సీలతో తక్షణమే చర్చలు జరపాలని జగన్ సూచించారు. ప్రస్తుతం శ్రీశైలం ప్రాజెక్టు రిజర్వాయర్లో పూర్తిస్థాయిలో నీటి నిల్వ ఉన్నందున.. జల విద్యుత్ కేంద్రంలో అన్ని ప్లాంట్ల ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేయాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. కేంద్రంలోని సంబంధిత శాఖలతో పాటు పొరుగు రాష్ట్రాలతో కూడా సమన్వయం చేసుకుని విద్యుత్ లోటు లేకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు సీఎం జగన్. తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన ఈ సమావేశంలో విద్యుత్ శాఖ ముఖ్య అధికారులు అంతా హాజరయ్యారు. అయితే తన సొంత శాఖపై జరుగుతున్న సమావేశానికి మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి గైర్హాజరు అయ్యారు.