శబరిమల ప్రవేశంపై సీఎం క్లారిటీ..!
మకర విళక్కు సందర్భంగా ప్రతి ఏటా అయ్యప్ప దర్శనానికి భక్తులు పెద్ద ఎత్తున శబరిమల కొండకు వస్తుంటారు. స్వామి దర్శనం చేసుకునే భక్తులకు ఎలాంటి వయో పరిమితి లేదన్నారు. పదేళ్ల లోపు పిల్లలకు, 65 ఏళ్లు దాటిన వారిని కూడా స్వామి దర్శనానికి అనుమతిస్తారమన్నారు పినరయి విజయన్. అయితే ప్రతి ఒక్కరు వ్యాక్సిన్ రెండు డోసులు వేయించుకున్న సర్టిఫికేట్ లేదా 48 గంటల ముందు కొవిడ్ నెగిటివ్ అని ఆర్టీపీసీఆర్ రిపోర్టు తప్పనిసరిగా తీసుకురావాలని స్పష్టం చేశారు. సర్టిఫికేట్ లేని వారిని పంపా నది వద్దే ఆపేస్తామన్నారు. ఇక శబరిమల చేరుకున్న ప్రతి ఒక్కరు నెయ్యాభిషేకం చేసే అవకాశం కల్పించాలని ట్రావెన్ కోర్ దేవస్థానం బోర్డును ప్రభుత్వం ఆదేశించింది. ఎరుమేలి మీదుగా అటవీ మార్గంలో కానీ... పులిమేడు మీదుగా సన్నిధానానికి సంప్రదాయ మార్గంలో కానీ... భక్తులకు ఎట్టి పరిస్థితుల్లో అనుమతి లేదన్నారు ముఖ్యమంత్రి విజయన్. భక్తుల వాహనాలను నిలక్కల్ వరకు మాత్రమే అనుమతించారు. అక్కడ నుంచి పంపా నది వరకు కేరళ స్టేట్ ఆర్టీసీ బస్సుల్లో వెళ్లాల్సి ఉందన్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేస్తున్నాట్లు కేరళ సీఎం పినరయ్ విజయన్ తెలిపారు.