సోలార్ పవర్తోనే ఇన్ని కష్టాలు...!
నాలుగున్నర ఏళ్ల క్రితం ప్రారంభమైన ఈ మెగా సోలార్ ప్రాజెక్టు వల్ల ఇప్పుడు పావుగడ వాసుల కష్టాలు మరింత పెరిగాయి. ప్లాంట్ ఏర్పాటు చేసిన తర్వాత తాము అన్ని విధాలుగా నష్టపోయినట్లు ఆరోపిస్తున్నారు. ఇప్పుడు పావుగడ పరిసరాల్లో ఉష్ణోగ్రతలు గణనీయంగా పెరిగిపోయాయి. సాధారణ రోజుల్లో 30 డిగ్రీలు మాత్రమే ఉండే ఉష్ణోగ్రత.. ఇప్పుడు ఏకంగా 6 డిగ్రీలు పెరిగిపోయింది. సోలార్ ప్లేట్ల ఏర్పాటు వల్ల ప్రస్తుతం పావుగడ పరిసరాల్లో ఉష్ణోగ్రతలు భారీగా పెరిగిపోయింది. దీని వల్ల పంటలు కూడా నష్టపోతున్నట్లు ఆరోపించారు గ్రామస్థులు. ఈ మెగా ప్రాజెక్టు వల్ల పావుగడ పరిసరాల్లోని వల్లూరు, తిరుమణి, బాలసముద్రం, కేతగంచర్లు, రాయల్చెర్వు గ్రామాల వాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్లాంట్ ఏర్పాటు సమయంలో వేడి తగ్గించేందుకు అటవీ ప్రాంతాన్ని విస్తరిస్తామని కేఎస్పీడీసీఎల్ అధికారులు హామీ ఇచ్చారని... కానీ కనీసం ఆ దిశగా ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆరోపిస్తున్నారు. తమకు పంట నష్టం పరిహారం చెల్లించాలని ఐదు గ్రామాల రైతులు ఇప్పుడు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు.