కేంద్ర మంత్రులపై పవన్ ప్రసంశల వర్షం
దీనిపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పందిస్తూ ప్రకాశం జిల్లాలో అత్యవసరంగా విమానాలు దిగేలా రోడ్లు నిర్మించడం అభినందనీయం అని కొనియాడారు. దేశ భద్రత , ప్రకృతి వైపరీత్యాల వల్ల తలెత్తే అత్యవసర పరిస్థితుల్లో ప్రజలను ఆదుకోవడం, రహదారులపై సైతం విమానాలు దిగేలా నిర్మాణాలను చేపట్టడం అంటూ ఆయన తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసారు. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వానికీ , ప్రధాని నరేంద్ర మోదీ కి అభినందనలు చెప్పారు. జాతీయ మాల పథకంలో భాగంగా రాజస్థాన్ లోని జాతీయ రహదారిపై బాడ్మేర్ వద్ద నిర్మించిన ఎయిర్ స్ట్రిప్ తలమానికంగా నిలుస్తోంది అన్నారు.
ఈ విశిష్ట పథకాన్ని ఆంధ్రప్రదేశ్ లో కూడా అమలు చేస్తున్నందుకు తెలుగు ప్రజల తరఫున కృతజ్ఞతలు చెప్పారు పవర్ స్టార్. జాతీయ రహదారుల అభివృద్ధిలో గణనీయంగా కృషి చేస్తున్న కేంద్ర మంత్రులు నితిన్ గడ్కరీ, గవాయుసేన పక్షాన ఈ నిర్మాణాలను పర్యవేక్షిస్తున్న కేంద్ర మంత్రి రాజ్ నాథ్ సింగ్ ప్రశంసనీయులు అని పవన్ కళ్యాణ్ కొనియాడారు. ఈ పథకం ద్వారా మన దేశంలో రోడ్లను అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించారు అన్నారు. మీ నిబద్ధత మన దేశానికి , ప్రజలకు సత్పలితాలను అందిస్తుందని విశ్వసిస్తున్నాను అని తెలిపారు.