ఐసీయూ బెడ్మీద తాళి కట్టిన యువకుడు కానీ చివరకు..?
తెలంగాణ రాష్ట్రంలోని సంగారెడ్డి జిల్లాలో జరిగిన ఓ ఘటన అందర్నీ కన్నీరు పెట్టేలా చేస్తోంది. కేవలం 27 ఏళ్ల ఓ మహిళ మంచి జాబ్ చేస్తూ తనని ఎంతగానో ప్రేమిస్తున్న వ్యక్తిని ఇంట్లో ఒప్పించి ఈ ఏడాది చివరన పెళ్లి చేసుకుని హ్యాపీగా జీవించాలి అనుకుంది. కాకపోతే కరోనా మహమ్మారి ఆమె ఆశయాన్ని అడియాసలు చేసింది. కరోనా పాజిటివ్ వచ్చిన తర్వాత ఆమె కుటుంబ సభ్యులు ఆవిడ ట్రీట్మెంట్ కోసం హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో జాయిన్ చేశారు. ఆ అమ్మాయిని గత మూడు సంవత్సరాలుగా ప్రేమిస్తున్న యువకుడు కాపాడుకునేందుకు శతవిధాల ధైర్యం చెబుతూ.., ఆమెను కాపాడుకోవడానికే విశ్వప్రయత్నం చేశాడు. అయితే విధి వక్రీకరించడం తో ఆమె ఆరోగ్య పరిస్థితి రోజురోజుకూ క్షీణించింది.
ఈ సమయంలోనే డాక్టర్ల అనుమతితో ఆ యువకుడు వెంటిలేటర్ పై చికిత్స పొందుతున్న యువతితో మాట్లాడుతూ.. నీకు ఏం కాదు నువ్వు క్షేమంగా ఇంటికి వస్తావు. అందరూ మెచ్చుకునేలా మన జీవితాన్ని మొదలు పెడదాము అని భరోసా ఇవ్వడమే కాకుండా.., అదే సమయంలో ఆ అమ్మాయి ట్రీట్మెంట్ తీసుకుంటున్న బెడ్ పైన ఆ యువతి మెడలో తాళి కట్టి ఇకపై నేను ఆ అమ్మాయికి కొండంత భరోసా ఇచ్చాడు. కానీ కరోనా మహమ్మారి ముందు ఏవి పని చేయలేదు. వెంటిలేటర్ పై ఉన్న ఆ యువతి కొన్ని రోజుల పాటు మృత్యువుతో నిరవధికంగా పోరాడి చివరికి తుది శ్వాస విడిచింది. దాంతో చివరకు ఆ అమ్మాయి తమ్ముడు, అలాగే తాళి కట్టిన యువకుడు దగ్గరుండి ఆవిడకు అంత్యక్రియలు పూర్తి చేశారు. అయితే ఆ అమ్మాయి మరణించిన విషయం మాత్రం ఆవిడ తల్లిదండ్రులకు చెప్పలేదు.