ఆక్సిజన్ ట్యాంకర్ల విషయంలో సరికొత్త మార్పులు.. !!

Suma Kallamadi
ఒకప్పుడు ఆక్సిజన్ ఎంత కావాలంటే అంతా మనకి దొరికేది. ఎంచక్కా బయట కూర్చుని పచ్చని చెట్ల నుంచి వచ్చే చల్లగాలిని పీల్చుకుని ఎన్ని రోజులు అయిందో కదా..! ఏమంటా కరోనా మహమ్మారి దేశంలో ప్రవేశించిందో అప్పటి నుంచే గాలి కూడా కలుషితం అయిపోయింది. ఆక్సిజన్ కోసం వెతుక్కోవలిసిన పరిస్థితి వస్తుంది. కరోనా వల్ల ఆక్సిజన్ కూడా కొనుక్కోవలిసిన దుర్భర పరిస్థితులను ప్రస్తుతం మన దేశం ఎదుర్కొంటుంది. అందుకనే ఆక్సిజన్ కొరత వల్ల ఎవరు కూడా ప్రాణాలు వదిలేయకూడదని ఇతర రాష్రాల నుంచి తెలంగాణ నగరానికి తరలించే ఆక్సీజన్ రవాణాలో ఎలాంటి ఆలస్యం లేకుండా చూడాలని  ఆయా శాఖలు సమన్వయంతో  వ్యవహరించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ అధికారులను ఆదేశించారు.

 ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆదేశాల మేరకు  ట్రాన్స్ పోర్టు, ఆర్.టి.సి అధికారులతో  సోమేశ్ కుమార్ ఈ  సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఇతర రాష్ట్రాలకు ఆక్సిజన్ ట్యాంకర్లను పంపి ,తిరిగి తెప్పించుటలో వేగాన్ని పెంచుటకై చేపట్టాల్సిన చర్యల గురించి చర్చించారు.మన రాష్ట్రానికి ఒడిశాలోని అంగూర్ నుండి , కర్టాటక లోని బళ్లారి నుండి మెడికల్ ఆక్సిజన్ ను ట్యాంకర్ల ద్వారా తెప్పిస్తున్నామని ప్రధాన కార్యదర్శి తెలిపారు. ఆక్సిజన్ సిలిండర్ రవాణాలో ఆలస్యాన్ని నివారించుటకు పోలీస్ ఎస్కార్ట్ వాహనాలతో పాటు, మెకానిక్ లు,ఇతర నిపుణుల బృందాలను ఏర్పాటు చేయాలని ఆధికారులను ఆదేశించారు.


ఆక్సిజన్ ట్యాంకర్లతో ప్రయాణించే ఆక్సిజన్ ఎక్స్ప్రెస్ కు రైల్వే శాఖ ఏర్పాటు చేసిన గ్రీన్ ఛానల్ సదుపాయాన్ని వినియోగించేందుకు సంబంధిత అధికారులతో మాట్లాడాలని సూచించారు.ఫలితంగా అంగూర్ కు ప్రయాణ సమయాన్ని ఆరు రోజుల నుండి మూడు రోజులకు తగ్గించగలుగుతామని పేర్కొన్నారు.అంతేకాకుండా కొన్ని నిర్దేశిత పాయింట్లకు ఆక్సిజన్ ట్యాంకర్లను నడపుటకు  24 గంటలు అందుబాటులో ఉండే విధంగా ఆర్.టి.సి. డ్రైవర్లు, మెకానిక్ ల బృందాలను ఏర్పాటు చేయాలని రవాణా అధికారులను ఆదేశించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: