మాజీ మంత్రిపై ట్విట్టర్ వేదికగా రెచ్చిపోయిన వైసీపీ ఎంపీ...?

VAMSI
" data-original-embed="" >

గత రెండు రోజుల క్రితం గుంటూరు జిల్లా టీడీపీ సీనియర్ నేత పొన్నూరు మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రను ఏసీబీ అధికారులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈయన అప్పటికే సంగం డైరీ చైర్మన్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డైరెక్టుగా నరేంద్ర ఇంటి దగ్గరకు 100 మంది పోలీసులతో వచ్చిన ఏసీబీ అధికారులు తమ వాహనంలోనే తీసుకెళ్లారు. అరెస్ట్ కి గల కారణాలను ఏసీబీ ఈ విధంగా వివరించింది. సంగం డెయిరీలో అక్రమాలు జరిగాయని ఆరోపణల్లో భాగంగా నరేంద్రను అరెస్ట్ చేశామని తెలిపారు. అంతే కాకుండా ఈయనపై 408, 409, 418, 420, 465 సెక్షన్ల కింద నాన్ బెయిలబుల్ కేసును నమోదు చేశామని తెలిపారు. మరియు ఏసీబీ నరేంద్రకు 14 రోజుల రిమాండును విధించింది.
అరెస్ట్ అయి రెండు రోజులు కావస్తుండడంతో ఆ అరెస్టుపై టీడీపీకి చెందిన ముఖ్య నాయకులంతా రకరకాలుగా స్పందిస్తున్నారు. ఇందులో భాగంగానే మాజీ మంత్రి టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు మాట్లాడుతూ రాజకీయంగా టీడీపీని మరియు టీడీపీ నాయకులను ఎదుర్కోవడం చేతకాక అక్రమ అరెస్టులు చేస్తున్నారు అంటూ వైసీపీ పై మండి పడ్డారు. వైసీపీ ప్రభుత్వం అరాచక పాలనను కొనసాగిస్తోందని యనమల ఏపీ ప్రభుత్వంపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు యనమల రామకృష్ణుడు చేసిన వ్యాఖ్యలపై వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ట్విట్టర్ వేదికగా రెచ్చిపోయారు.
ఈయన మాట్లాడుతూ యనమల రామకృష్ణుడికి గడిచిన ఏపీ స్థానిక ఎన్నికలలో తన సొంతనియోజకవర్గంలోనూ చిత్తుగా ఓడిపోయినందున పిచ్చి బాగా ముదిరిపోయిందని సెటైరికల్ గా మాట్లాడారు. ధూళిపాళ్ల నరేంద్రను వందల కోట్ల అవినీతి చేసినందుకు అరెస్ట్ చేస్తే, యనమల రాజకీయంగా ఎదుర్కోలేక ప్రభుత్వమే అరెస్ట్ చేసింది అని అనడం సమంజసం కాదు అని మండిపడ్డారు. మాజీ ఎమ్మెల్యే గా ఉన్న narendra KUMAR' target='_blank' title='ధూళిపాళ్ల నరేంద్ర-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">ధూళిపాళ్ల నరేంద్ర స్థానిక ఎన్నికల్లో ఏమి సాధించారో మీకు తెలీదా అన్నారు. మీలాగే పంచాయతీలు, మునిసిపాలిటీలు గుండు సున్నా...? అని ఏకిపారేశారు విజయసాయి రెడ్డి. అయితే దీనిపై యనమల ఏ విధంగా స్పందిస్తాడో తెలియాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: