మెగాస్టార్ మనసు కదిలించిన ఆ ఫోటో కథేంటి ...!?

Hareesh
పోలీసు డిపార్ట్‌మెంట్ లో పై అధికారులకు సెల్యూట్ చేస్తుంటారు. అది వారిమీద ఉండే గౌరవం. కానీ పోలీసు ఉద్యోగం చేసే ఓ తండ్రి తన కూతురుకి సెల్యూట్ చేశాడు. తండ్రిని మించిన తనయగా ఎదిగిన తన గారాల పట్టి ఆ తండ్రి పోలీస్ సెల్యూట్ చేశాడు. ఎందుకంటే తన కూతురు తనకంటే ఉన్నతస్థాయి పోలీసు ఉద్యోగంలో చేరినందుకు..ఆ తండ్రి చేసే సెల్యూట్ లో ఆనందంతోపాటు ప్రేమ, గర్వం, గౌరం అన్నీ కలగలిసి ఆ పోలీసుల తండ్రి కళ్లల్లో కదలాడాయి. తండ్రి చేసిన ఆ సెల్యూట్ తో ఆ కూతురు కూడా ‘‘నాన్నా నీ కలను నెరవేర్చాను..అందుకు నాకు కూడా సంతోషంగా ఉంది’’అన్నట్లుగా నవ్వింది. ఈ అరుదైన సంఘటనకు ఏపీ పోలీసు శాఖ ప్రతిష్టాత్మకంగా తిరుపతి లో‌ నిర్వహిస్తున్న మొట్ట మొదటి పోలీస్ డ్యూటీ మీట్ 2021కి “ఇగ్నైట్” వేదికైంది.

2018 బ్యాచ్ కి చెందిన జెస్సీ ప్రశాంతి గుంటూరు అర్బన్ సౌత్ డీఎస్పీగా చార్జ్ తీసుకున్నారు. ప్రస్తుతం తిరుపతిలో జరుగుతున్న పోలీస్ డ్యూటీ మీట్ లో “దిశ” విభాగంలో బాధ్యతలు నిర్వహిస్తున్నారు జెస్సీ ప్రశాంతి. ఆమె తండ్రి శ్యామ్ సుందర్ తిరుపతి కళ్యాణి డ్యామ్ లో పోలీస్ ట్రైనింగ్ సెంటర్ లో సర్కిల్‌ ఇంస్పెక్టర్ గా పని చేస్తున్నారు.తిరుపతిలో జరుగుతున్న పోలీస్ డ్యూటీ మీట్ లో డ్యూటీలో ఉన్న తన కూతురిని చూస్తూ మురిసిపోయారు సర్కిల్‌ ఇంస్పెక్టర్ శ్యామ్ సుందర్. తన కూతురు తనకంటే పెద్ద ర్యాంక్ లో చేరినందుకు ఆ తండ్రి సంతోషంగా ఉప్పొంగిపోయారు

మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియాలో ఎంత దూకుడుగా ఉంటారో అందరికీ తెలిసిందే. సెటైర్లు, పంచ్‌లు వేయడమే కాదు.. మంచి ఎక్కడున్నా, గొప్ప పని ఎవరు చేసినా అభినందిస్తుంటారు. ఎక్కడ ఏ మూలన ఎవ్వరు ఏ మంచి చేసినా కూడా అది పది మందికి తెలిసేలా చేస్తాడు.ఆ తండ్రీ కూతుళ్ల ఫోటోను చిరంజీవి షేర్ చేస్తూ.. ఈ ఫోటోలో ఉంది తండ్రి-కూతురు.. తండ్రి సీఐ శ్యాం సుందర్ గారు.. కూతురు డీఎస్పీ జెస్సీ ప్రశాంతి.. తన గుండెలమీద ఎత్తుకుని పెంచిన బిడ్డ,తనపై అధికారిగా వచ్చినప్పుడు ఆ తండ్రి చేసిన సెల్యూట్లో బోల్డంత సంతృప్తి ని,గర్వాన్ని,ప్రేమని చూసాను. శ్యాం సుందర్ గారు.. నేను మీకు సెల్యూట్ చేస్తున్నాను...మీ ఇద్దరు ఇంకెందరికో స్ఫూర్తి అంటూ ఎమోషనల్ అయ్యాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: