లాలూ ఇంటికి తరచూ వచ్చే శ్రద్దానంద మహరాజ్ భవిష్యవాణి చెబుతారు.. కాశీలో ఒక ఆశ్రమాన్ని నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం ఆయన బిహార్లోని భఖ్తియాపూర్లో కూడా ఒక ఆశ్రమాన్ని నిర్మిస్తున్నారు. రబ్రీదేవి ఇంటికి వచ్చిన బాబా ప్రసాదంతో పాటు భగవద్గీతను ఆమెకు బహుకరించారు. ఆ ప్రసాదాన్ని రబ్రీ.. రాంచీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తన భర్త లాలూకు కూడా పంపించారు. రబ్రీని కలసిన శ్రద్ధానంద మహరాజ్.. మీ కుమారుడు తేజస్వీ యాదవ్ ఏదో ఒకరోజు ప్రధాని అవుతారని జోస్యం చెప్పారు.