భారత్ ను పాకిస్తాన్లో కలిపేస్తాడట.. ఏంటో ఈ ప్రమాణాలు..?
రోజురోజుకు ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయి దీన స్థితిలోకి వెళ్ళిపోతున్న పాకిస్తాన్ గురించి ఆలోచించకుండా ఎప్పుడూ ఇతర దేశాల పై పడి ఏడుస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే సంచలన వ్యాఖ్యలు చేస్తూ ఎప్పుడూ హాట్ టాపిక్ గా మారి పోతూ ఉంటారు ఇక ఇటీవల షోయబ్ అక్తర్ చేసిన వ్యాఖ్యలు కాస్తా సంచలనంగా మారిపోయాయి. మొదట కాశ్మీర్ ని ఆ తర్వాత భారత దేశాన్ని కూడా పాకిస్తాన్ కలిపి వేసుకుంటామని.. అంటూ ఇటీవల షోయబ్ అక్తర్ చేసిన వ్యాఖ్యలు కాస్తా సంచలనంగా మారిపోయాయి.
షోయబ్ అక్తర్ వ్యాఖ్యలపై స్పందిస్తున్న విశ్లేషకులు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అక్కడ ప్రజలకు కనీసం తినడానికి తిండి లేని పరిస్థితి ఉందని అక్కడి ప్రజల ప్రయోజనాలను గాలికి వదిలేసి.. విదేశాలకు అప్పు తీర్చడం పైన దృష్టి పెట్టడం మానేసి భారత్ గురించి మాట్లాడడం విడ్డూరంగా ఉంది అని అంటున్నారు విశ్లేషకులు. కొన్ని రోజుల నుంచి కాశ్మీర్ ప్రాంతంలోపాకిస్తాన్ సైన్యంపై ఉగ్రవాదులపై భారత సైన్యం విరుచుకుపడుతుంటే ఇప్పుడు షోయబ్ అక్తర్ ఏకంగా కాశ్మీర్ను భారత్లో పాకిస్థాన్ లో కలిపేస్తామని చెప్పడం హాస్యాస్పదం అని అంటున్నారు విశ్లేషకులు.