హైదరాబాద్ లో రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్

SRISHIVA
భారత రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ హైదరాబాదు వచ్చారు.  ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో ఆయన దుండిగల్ ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు. దుండిగల్ ఎయిర్ ఫోర్స్ అకాడమీలో ట్రైనీ అధికారులతో ఆయన సమావేశమయ్యారు. రెండు రోజుల పాటు హైదరాబాదులోనే ఉండనున్నారు రాజ్ నాథ్ సింగ్. శనివారం జరగనున్న ట్రైనీ పైలట్ల పరేడ్ లో ఆయన పాల్గొననున్నారు. శనివారం సాయంత్రం పహాడీషరీఫ్ లోని ఆర్సీఐలో డీఆర్డీవో రక్షణ పరికరాలను పరీక్షిస్తారు రాజ్ నాథ్ సింగ్. అనంతరం ఆయన ఢిల్లీకి తిరిగి వెళతారు.  

  క్షిపణులు కూడా వెళ్లలేని చోటుకూ మొబైల్ ఫోన్ పరిధి విస్తరించిందని, ప్రస్తుత పరిస్థితుల్లో సరిహద్దులు దాటకుండానే శత్రువు ప్రజలను చేరే అవకాశం ఉన్నదని కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. ఈ నేపథ్యంలో ప్రతి పౌరుడు సైనికుడి పాత్రను పోషించాలని కోరారు. చండీగఢ్‌లో నిర్వహించిన వార్షిక మిలిటరీ సాహిత్యోత్సవంలో రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. ప్రపంచ వ్యాప్తంగా సోషల్‌ మీడియా, మొబైల్ యాప్‌ల ప్రభావాన్ని ఉటంకిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. తప్పుడు, పక్కదారి పట్టించే సమాచారం పట్ల మనల్ని మనం కాపాడుకుంటూ ఇతరులను కాపాడాల్సిన అవసరం ఉందన్నారు రాజ్ నాథ్ సింగ్.
    ప్రస్తుతం కాలంతో పాటు భద్రతా పరమైన ముప్పులు కూడా మారాయని చెప్పారు రక్షణ మంత్రి. యుద్ధరీతిలో కూడా మార్పులు వచ్చాయన్నారు. భవిష్యత్తులో మన ముందుకు విభిన్న రీతిలో భద్రతా ముప్పులు రావచ్చునని చెప్పారు. 1971లో పాకిస్తాన్‌తో యుద్ధం జరిగి 50 ఏండ్లు పూర్తవుతున్నాయని, ఈ ఏడాది నిర్వహిస్తున్న స్నాతకోత్సవం ఎంతో ప్రత్యేకమైందన్నారు. ఈ యుద్ధంలో దేశం కోసం పోరాడి పదవీ విరమణ చేసిన సైనికుల నుంచి యువత నేర్చుకోవాలని రాజ్ నాథ్ సింగ్ సూచించారు. మొబైల్ ఫోన్లలో యుద్ధానికి సంబంధించిన ఆటలు ఆడవచ్చు కానీ, నిజమైన యుద్ధానికి దానికి ఎంతో తేడా ఉంటుందన్నారు.
  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: