బాబు ను దోషిగా నిలబెట్టడానికి జగన్ రెడీ అయ్యారా...?
అయితే ఇప్పుడు జగన్ మరో వ్యూహం సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ప్రజలకు ఇచ్చే ఇళ్ల పట్టాలను చంద్రబాబు నాయుడు అడ్డుకున్నారు అనే విషయాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకుని వెళ్లే విధంగా వ్యూహాలు సిద్ధం చేస్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు వస్తే ఇళ్ల పట్టాలు ద్వారా మేము ఎక్కడ లబ్ధి పొందుతారు అని ఆలోచనలో ఉండి చంద్రబాబు నాయుడు అడ్డుకుంటున్నారని దీని ద్వారా ప్రజలు ఎక్కువగా నష్టపోతున్నారని, అంతే కాకుండా మీకు ఒక ఆస్తి లేకుండా చేయడానికి చంద్రబాబు నాయుడు మీ మీద ఓడించినందుకు కక్ష సాధించుకున్నారు అనే విషయాన్ని ప్రజల్లోకి తీసుకుని వెళ్లే విధంగా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.
ఇప్పటికే దీనికి సంబంధించి ఆయన ఇద్దరు ముగ్గురు మంత్రులతో చర్చలు కూడా జరిపినట్లు సమాచారం. సోషల్ మీడియా తో పాటుగా ప్రధాన మీడియాలో కూడా ఇదే విషయాన్ని తీసుకుని వెళ్లాలి అని భావిస్తున్నారు. పత్రికల్లో ప్రకటనలు ఇవ్వాలని పార్టీ నేతలకు కూడా ఆయన సూచనలు చేసినట్లు తెలుస్తోంది. ఇళ్ల పట్టాలు ఇప్పటికే నాలుగైదు సార్లు వాయిదా పడుతూ వస్తున్న సంగతి తెలిసిందే. ఎలాగైనా సరే దసరాకు ఇవ్వాలని సీఎం జగన్ కూడా పట్టుదలగా వ్యవహరిస్తున్నారు.