బాబు ను దోషిగా నిలబెట్టడానికి జగన్ రెడీ అయ్యారా...?

ఆంధ్రప్రదేశ్ లో సీఎం జగన్ ని అర్థం చేసుకోవడం ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు చాలా కష్టంగా మారింది అనే వ్యాఖ్యలు ఎక్కువగా వినబడుతున్నాయి. ఇళ్ల పట్టాలు విషయంలో చంద్రబాబు నాయుడు వ్యవహార శైలి విషయంలో జగన్ మోహన్ రెడ్డి ఇప్పుడు చాలా వరకు ఆగ్రహంగా ఉన్నారు అనే విషయం స్పష్టంగా అర్థమవుతుంది. ఇళ్ల పట్టాలు ఇవ్వాలి అనుకుంటే కోర్టులో కేసులు వేయించి ప్రముఖ న్యాయవాదుల ద్వారా దీనికి అడ్డం పడుతూ చంద్రబాబు నాయుడు వస్తున్నారని, దీంతో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చాలా వరకు ఆగ్రహంగా ఉన్నారని వార్తలు ఎక్కువగా వస్తూ ఉన్నాయి.
అయితే ఇప్పుడు జగన్ మరో వ్యూహం సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ప్రజలకు ఇచ్చే ఇళ్ల పట్టాలను చంద్రబాబు నాయుడు అడ్డుకున్నారు అనే విషయాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకుని వెళ్లే విధంగా వ్యూహాలు సిద్ధం చేస్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు వస్తే ఇళ్ల పట్టాలు ద్వారా మేము ఎక్కడ లబ్ధి పొందుతారు అని ఆలోచనలో ఉండి చంద్రబాబు నాయుడు అడ్డుకుంటున్నారని దీని ద్వారా ప్రజలు ఎక్కువగా నష్టపోతున్నారని, అంతే కాకుండా మీకు ఒక ఆస్తి లేకుండా చేయడానికి చంద్రబాబు నాయుడు మీ మీద ఓడించినందుకు  కక్ష సాధించుకున్నారు అనే విషయాన్ని ప్రజల్లోకి తీసుకుని వెళ్లే విధంగా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.
ఇప్పటికే దీనికి సంబంధించి ఆయన ఇద్దరు ముగ్గురు మంత్రులతో చర్చలు కూడా జరిపినట్లు సమాచారం. సోషల్ మీడియా తో పాటుగా ప్రధాన మీడియాలో కూడా ఇదే విషయాన్ని తీసుకుని వెళ్లాలి అని భావిస్తున్నారు. పత్రికల్లో ప్రకటనలు  ఇవ్వాలని పార్టీ నేతలకు కూడా ఆయన సూచనలు చేసినట్లు తెలుస్తోంది. ఇళ్ల పట్టాలు ఇప్పటికే నాలుగైదు సార్లు వాయిదా పడుతూ వస్తున్న సంగతి తెలిసిందే. ఎలాగైనా సరే దసరాకు ఇవ్వాలని సీఎం జగన్ కూడా పట్టుదలగా వ్యవహరిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: