ఉగ్రవాది భార్య కొత్త సెంటిమెంట్.. ఇది మరీ నీచం..?
అయితే ఇస్లామిక్ స్టేట్ కి సంబంధించిన ఉగ్రవాదిని అరెస్టు చేయడం ఒక్కసారిగా సంచలనంగా మారిపోయింది. గతంలో ముంబైలో సృష్టించిన మారణహోమం మాదిరిగానే ఢిల్లీలో కూడా భారీ ఉగ్ర కుట్ర కు ప్లాన్ చేసినట్లు పోలీసులకు కీలక సమాచారం అందింది. అంతేకాకుండా ఒక ప్రముఖ వ్యక్తిని హత్య చేయడానికి ఇస్లామిక్ స్టేట్స్ నుంచి సదరు ఉగ్రవాది ఢిల్లీకి చేరుకుని రెక్కీ కూడా నిర్వహించినట్లు పోలీసులు గుర్తించారు. మరిన్ని వివరాలు తెలుసుకునేందుకు సదరు ఉగ్రవాదిని విచారిస్తున్నారు.
ఇదిలా ఉంటే ప్రస్తుతం సదరు ఉగ్రవాది భార్య వినిపిస్తున్న వాదన సంచలనంగా మారిపోయింది. తన భర్త ఇలాంటివి ప్లాన్ చేస్తున్న విషయం మొదటి నుంచి తెలుసని అయితే ఇదంతా తప్పు ఇలా చేయకూడదు అని వాదించినప్పటికీ తన భర్త వినలేదు అంటూ చెబుతుంది ఉగ్రవాది భార్య. ఈ క్రమంలోనే ఫ్యామిలీ సెంటిమెంట్ ను బయటకు తీసుకు వచ్చింది. తమకు నలుగురు పిల్లలు ఉన్నారని ప్రస్తుతం తన భర్త లేకపోతే తండ్రి లేని వారు అవుతారు అని తన భర్తను వదిలేయాలి అంటూ కోరుతుంది ఉగ్రవాది భార్య. దీనిపై విశ్లేషకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒకవేళ సదరు మహిళకు దేశంపై ప్రేమ ఉంటే ముందుగానే భర్త గురించి పోలీసులకు సమాచారం ఇచ్చేదని కానీ ఇప్పుడు తమ పిల్లల గురించి ఆలోచిస్తుంది తప్ప తన భర్త తీయాలనుకున్న ప్రాణాల గురించి ఆలోచించడం లేదు అంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు..