దయ్యం కసరత్తులు.. పోలీసులే అవాక్కయ్యారు.. వీడియో వైరల్..?

praveen

అసలు దెయ్యాలు ఉన్నాయా లేవా... ఇది మాత్రం ఎన్నో ఏళ్ల నుంచి సమాధానం లేని ప్రశ్న. కొంతమంది దయ్యాలు ఉన్నాయి అని చెప్తే... ఇంకొంతమంది దయ్యాలు లేవు అది అంతా ఒక బూటకం నాటకం అని అంటూ ఉంటారు. ఇక అటు జనాలు కూడా దయ్యాలు లేవు అని నమ్ముతూనే మరోవైపు.. ఏదైనా  విచిత్రమైన సంఘటన జరిగింది అంటే అది దయ్యమే  చేసిందేమో అని అనుకుంటూ ఉంటారు. ఇలా దయ్యం  అనే దానిపై ఎన్నో రోజుల నుంచి ఎంతో చర్చ జరుగుతూనే ఉంది. మరి దయ్యాలు ఉన్నాయా లేవా... అంటే ఇక్కడ జరిగిన సంఘటన చూస్తే మాత్రం నిజంగానే దయ్యాలు  ఉన్నాయేమో అని అనిపిస్తూ ఉంటుంది. 

 


 ఇక్కడ జరిగిన సంఘటన నిజంగా మనకు ఎదురైతే వెన్నులో వణుకు పుడుతుంది అనే చెప్పాలి. రాత్రి వేళల్లో నడుచుకుంటూ వెళుతుండగా... పక్కనే ఉన్న జిమ్  యంత్రాలు వాటంతట అవే కదులుతూ ఉండటం కనిపిస్తే అది గుండె జారి పోతుంది కదా. అలాంటి ఘటన ఇక్కడ జరిగింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియా లో వైరల్ అవుతుంది. ఢిల్లీలోని కరోల్ బాగ్ లో ఉన్న పార్కులో... ఒక జిమ్ యంత్రం  ఎవరి ప్రమేయం లేకుండానే దానంతట అదే కదులుతోంది. ఇక స్థానికులు దీనిని గమనించి ఏకంగా పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు వచ్చి ఆ యంత్రాన్ని గమనించగా దానంతట అదే కదలడం పోలీసులను కూడా ఆశ్చర్యపరిచింది. దీంతో దయ్యమే  యంత్రం పై కసరత్తు చేస్తోంది అంటూ నెటిజనులు ఈ వీడియోపై ఆసక్తికర కామెంట్ చేశారు. 

 


 అయితే తాజాగా ఉత్తరప్రదేశ్ లోని ఝాన్సీ పోలీసులు ఈ వీడియో పై స్పందిస్తూ ఈ ఘటన ఢిల్లీలో జరగలేదు అంటూ చెప్పుకొచ్చారు. అయితే జిమ్ మంత్రం ఎవరి ప్రమేయం లేకుండా దానంతట అదే కదులుతూ ఉండటం వెనుక దయ్యం భూతం లాంటివి ఏమీ లేవని కేవలం అది మనుషుల పని అంటూ చెప్పుకొచ్చారు పోలీసులు.ఆ జిమ్  యంత్రానికి గ్రీస్  ఎక్కువగా పెట్టడం కారణంగా అలా కదులుతూ ఉంది అంటూ తెలిపారు. ఒక్కసారి ఆ జిమ్ యంత్రాన్ని కదిపి  వదిలేస్తే కొన్ని నిమిషాల పాటు అలాగే కదులుతూ ఉంటుంది అని చెప్పుకొచ్చారు పోలీసులు. కొందరు ఆకతాయిలు కావాలనే ఈ యంత్రాన్ని కదిపి  ఆ తర్వాత ఎవరూ లేకుండా కదులుతున్న యంత్రాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది వైరల్ గా మారింది... ఇలా తప్పుడు ప్రచారం చేసిన వారి కోసం గాలిస్తున్నామని పోలీసులు చెప్పుకొచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: