బడ్జెట్-2020 :కష్టాల్లో ఉన్న రైతుల కి మోదీ ప్రభుత్వం శుభవార్త చెప్పనుంది
రైతుల కష్టపడి ఎంతో శ్రమ తో దేహ కష్టం తో నిత్యం శ్రమ లో తడిసి వేసే పంటకి ఫలితం దక్కని దు:స్థితి. చెమట లో కూరుకుని మట్టి తో జీవితాన్ని సాగించినా నవ్వు పండని దిక్కు. కానీ నేడు మన ప్రభుత్వం రైతుల కి మంచి వార్త చెప్పనుంది. ఒకటి కాదు మన రైతుల కి రెండు స్కీముల తో ప్రభుత్వం సాయాన్ని అందించడానికి ముందు అడుగు వేస్తోంది. అయితే ప్రధమం గా రెండు యూనిట్ల బడ్జెట్ తో ఓ తీపి కబురు చెప్పడానికి సిద్ధమైంది కేంద్ర సర్కార్.
ఆర్ధిక మంత్రి ఈ విషయాలను రేపు చర్చించనున్నారు. అందరి కళ్ళు 2020 బడ్జెట్ పైనే ఉన్నాయి అని అర్ధమవుతోంది. కానీ అక్కడ హీన స్థితి లో మమ ఆర్ధిక వ్యవస్థ ఉన్నది. ఇది మాత్రం ఎలా ఉన్నా రైతుల కి కొత్త స్కీములని చెబుతూ ఈ పధకానికి శ్రీకారం చుట్టనుంది. మన ఆర్ధిక మంత్రి నిర్మలా సీతా రామన్ ఈ బడ్జెట్ ని రేపు అనగా ఫిబ్రవరి 1 న ప్రవేశ పెడుతున్నారు.
అయితే కష్టాల్లో ఉన్న రైతులని ఆదుకోవడానికి ఎటువంటి స్కీములు ప్రవేశ పెడతారు అన్న విషయానికి వస్తే భిన్న పధకం రాబోతోంది అని స్పష్టం అవుతోంది. క్రాప్ డైవర్సిఫికేషన్ ఒకటి. మరొకటి ఏమిటంటే ఎఫ్. పీ. వో. ఇవి రెండు రైతుల కి అందించనున్నారు. అయితే క్రాప్ డైవర్సిఫికేషన్ కి వస్తే భిన్నం గా పంటలు అని అర్ధం అవుతోంది.
నిర్మలా సీతా రామన్ ఎఫ్. పీ వో ని విడుదల చేస్తామని చెప్పడం ఖచ్చితమేనని ప్రకటించడం ద్వారా మనం ఈ అభిప్రాయానికి రావచ్చు. ఇవి కనుక ఖచ్చితం అయితే రైతుల బాధలు తొలగి పోతాయి. అలానే సమస్యల నుండి దూరం అవుతారు. ఈ రెండు స్కీముల వల్ల రైతులు మరియు వారి కుటుంబాలకి శ్రేయస్కారం.
|
|