తీరం లో టెర్రర్!

Patra Brahmananda
శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా లో హై అలెర్ట్ ప్రకటించారు.ఈరోజు విడవలూరు మండలం రమతీర్థం సముద్రం లో ఒక మోటార్ బోట్ కనిపించింది. దాని గురించి అక్కడ ఉన్న మత్స్యకారులు పోలీసులకి సమాచారం అందించారు.అది పరిశీలించిన పోలీసులు అది శ్రీలంక కు చెందిన బోట్ గా గుర్తించారు. ఆ మోటార్ బోట్ లో  టార్చ్ లైట్ మరియు  వాటర్ బాటిల్ లభ్యం అయ్యాయి. ఆ బోట్ కు ఒక పక్క ఇండియా మరో పక్క శ్రీలంక స్టిక్కర్లు ఉన్నాయి.


Pslvc46 ప్రయోగానికి ముందు ఈ బోట్ కనిపించడం తో అందులో టెర్రరిస్టులు వచ్చి ఉండచ్చు అని పోలీసులు అనుమానిస్తున్నారు.అందుకే జిల్లా అంతా హై అలెర్ట్ ప్రకటించారు.ఆక్టోపస్ బలగాలు షార్ కి చేరుకున్నాయి.పోలీసులు విశృతం గా జిల్లా వారిగా తనిఖీలు చేస్తున్నారు.


జిల్లా అంతా భద్రతను కట్టుదిట్టం చేశారు.కృష్ణపట్నం పోర్టు లోను హై అలెర్ట్ ప్రటించారు.శ్రీలంక లో జరిగిన ఉగ్రదాడి తర్వాత అక్కడ తనిఖీలు ఎక్కువ అవ్వడంతో అక్కడి నుండి చాలా మంది పారిపోయారు.వారిలో కొందరు ఇటు వచ్చి ఉంటారు అని పోలీసులు అనుమానిస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: