మార్ఫింగ్ ఫోటోలపై ప్రణబ్ కుమార్తె సీరియస్!

Edari Rama Krishna
నిన్న మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో రాష్ట్రీయ స్వయం సేవక్‌ సంఘ్‌ (ఆరెస్సెస్‌) కార్యక్రమానికి హాజరయిన మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీకి సంబంధించి ఓ మార్ఫింగ్‌ ఫొటో హల్‌చల్‌ చేస్తోంది. ఆరెస్సెస్ కార్యకర్తలు ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రణబ్‌ ముఖర్జీ కూడా వారిలాగే కుడి చేతిని ఎత్తి ఛాతి వరకు ఉంచినట్లు ఆ ఫొటో ఉంది.  వాస్తవానికి ఆయన మామూలుగానే నిల్చున్నారు..దీనికి సంబంధించిన ఫోటోలో ప్రతికల్లో..న్యూస్ ఛానల్స్, వెబ్ సైట్స్ లో వచ్చాయి. కానీ కానీ ప్రణబ్‌…ఆర్.ఎస్.ఎస్‌ టోపీ పెట్టుకున్నట్లు ఆయన ప్రతిజ్ఞ చేస్తున్నట్లు ఫోటోలు ప్రత్యక్షమయ్యాయి. 

ఈ మార్ఫింగ్ ఫోటోలపై ప్రణబ్ కుమార్తె శర్మిష్ట రియాక్టయ్యారు. ఇలాంటిది జరుగుతుందని తాను ముందే చెప్పానంటూ బీజేపీపై  విమర్శలు చేశారు. నాగ్‌పూర్‌ ఆరెస్సెస్‌ సభలో ప్రణబ్‌ ముఖర్జీ చేసిన ప్రసంగాన్ని అందరూ మర్చిపోతారని… ఫొటోలు, వీడియోలు మాత్రమే గుర్తుంటాయని ఆమె ముందే చెప్పారు.  తన తండ్రి మాట్లాడి కొన్ని గంటలైనా కాకముందే ఇటువంటి ట్రిక్స్‌ చేస్తూ అసత్య ప్రచారం చేశారని ఆమె అన్నారు.

ఆర్‌ఎస్‌ఎస్‌ సభలో కాంగ్రెస్‌ సిద్ధాంతాలను గురించి ప్రస్తావించడం బాగుందని ఆ పార్టీ సీనియర్‌ నేత, కేంద్ర మాజీ మంత్రి పి.చిదంబరం అన్నారు. కొన్ని ఆర్‌ఎస్‌ఎస్‌ సిద్ధాంతాలు తప్పు అని ఆయన చెప్పడం చక్కగా ఉందన్నారు. ఆనంద్‌శర్మ, రణ్‌దీప్‌ సుర్జేవాలా కూడా ప్రణబ్‌ ప్రసంగాన్ని మెచ్చుకున్నారు.
.@CitiznMukherjee By going 2 Nagpur, u r giving BJP/RSS full handle 2 plant false stories, spread falls rumours as 2day & making it somewhat believable. And this is just d beginning! 2/2

— Sharmistha Mukherjee (@Sharmistha_GK) June 6, 2018 See, this is exactly what I was fearing & warned my father about. Not even few hours have passed, but BJP/RSS dirty tricks dept is at work in full swing! https://t.co/dII3nBSxb6

— Sharmistha Mukherjee (@Sharmistha_GK) June 7, 2018

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: