కుళ్లిపోయిన శవానికి పోస్టుమార్టం.. అంతలో షాకింగ్ ఘటన?

praveen
సాధారణంగా ఎలాంటి రిస్క్ లేని జాబ్ చేయడానికి ప్రతి ఒక్కరు కూడా ఎంతగానో ఆసక్తి కనపరుస్తూ ఉంటారు   ఇక అలాంటి జాబ్ సంపాదించడానికి తెగ ప్రయత్నాలు చేస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. కానీ కొంతమంది మాత్రం లైఫ్ లో రిస్క్ లేకపోతే ఇక కిక్ ఎక్కడ ఉంది అని భావిస్తూ అందరిలా కాకుండా భిన్నమైన ఉద్యోగాలను వెతుక్కోవడం లాంటివి చేస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. ఇక ఇక ఇలాంటి ఉద్యోగాలలో అటాప్సి టెక్నీషియన్ ఉద్యోగం కూడా ఒకటి. ఏకంగా చనిపోయిన వారి మృతదేహాలను పోస్టుమార్టం నిర్వహించడం అంటే పరిస్థితి ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

 ఇక ఈ ఉద్యోగం ఎంత ఛాలెంజ్ గా ఉంటుందో అంతే భయానకంగా కూడా ఉంటుంది అని చెప్పాలి. ఎందుకంటే చనిపోయిన శవాల దగ్గరికి వెళ్లడానికి అందరూ భయపడిపోతూ ఉంటారు. ఇక శవాలను దగ్గరగా చూడటానికి వణుకు పుడుతూ ఉంటుంది. కానీ అటాప్సీ టెక్నీషియన్ ఉద్యోగంలో చేరితే మాత్రం చనిపోయిన శవాలను దగ్గరగా చూడటం కాదు ఏకంగా శరీరం మొత్తం కోసి పరీక్షించడం లాంటివి చేస్తూ ఉండాలి. అయితే ఇలాంటి ఉద్యోగం చేయడానికి పురుషులే భయపడితే ఇక ఒక మహిళ ఉద్యోగంలో కొనసాగితే ఎలా ఉంటుంది.

 ఇలాంటి ఉద్యోగం చేయడానికి మహిళలు ధైర్యం చూపరు. కానీ అమెరికాలోని మేరీ ల్యాండ్స్ రాష్ట్రానికి చెందిన 31 ఏళ్ల జెసస్సిక మాత్రం అటాప్సీగా ఉద్యోగంలో చేరింది. ఈ క్రమంలోనే ఎంతోమంది శవాలను కోసి పోస్టుమార్టం నిర్వహించడం లాంటివి చేసింది. కానీ ఒకానొక సమయంలో ఊహించనిధిలో భయానక అనుభవం ఎదురయింది అన్న విషయాన్ని ఇటీవల చెప్పుకోచ్చింది. మరణించిన వ్యక్తికి శవ పరీక్ష చేస్తున్న సమయంలో అతని తొడలో నుంచి ఒక పాము ఆమెకు కనిపించిందట. అయితే ఆ పాము ఏకంగా సజీవంగా ఉందట. ఇక తొడను కోస్తున్న సమయంలో పాము బుసలు కొడుతూ బయటికి రావడంతో ఆమె ఒక్కసారిగా భయపడి అక్కడ నుంచి పరుగులు తీసిందట. డెడ్ బాడీ చాలా రోజులపాటు కుల్లిపోయిన స్థితిలో ఉండడంతో ఇక పాము లోపలికి వెళ్లి ఉంటుందని సదరు మహిళలు చెప్పుకొచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: