రష్యా యుద్ధం : ఉక్రెయిన్లో గుట్టలుగా శవాలు?

praveen
రోజులు గడుస్తున్నాయి.. ఎన్నో ప్రాణాలు పోతున్నాయి.. కానీ ఎక్కడ మార్పు మాత్రం కనిపించడం లేదు. ఉక్రెయిన్ రష్యా మధ్య జరుగుతున్న యుద్ధం రోజురోజుకూ తీవ్రరూపం దాలుస్తోంది తప్ప మాత్రం ఎక్కడా తగ్గు ముఖం పడుతున్నట్లు మాత్రం  కనిపించడం లేదు. రష్యా సేనలు ఎడతెరిపి లేకుండా ఉక్రెయిన్ పై దాడులకు పాల్పడుతున్న నేపథ్యంలో ఉక్రెయిన్ సైన్యం రష్యాను అడ్డుకునేందుకు సర్వ ప్రయత్నాలు చేస్తోంది. రష్యా ను సమర్ధవంతంగా ఎదుర్కొనేంత  బలం లేకపోయినప్పటికీ సాయశక్తులా తమ దేశ భూభాగాన్ని పెంచుకునేందుకు వీరోచితంగా పోరాటం చేస్తున్నాయి.



 దీంతో ఇక రష్యా ఉక్రెయిన్ మధ్య యుద్ధమే ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారిపోయింది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. అయితే ఉక్రెయిన్ లో ఉన్న ప్రధాన నగరాలతో పాటు రష్యా సేనలు విచక్షణారహితంగా బాంబుల వర్షం కురిపిస్తూ దాడులకు పాల్పడుతున్న విషయం తెలిసిందే. ఇక ప్రజలు నివాసముండే పెద్ద పెద్ద భవనాలు ని టార్గెట్ గా చేసుకుని దాడులకు తెగబడుతు మారణహోమం సృష్టిస్తున్నాయి. ఈ క్రమంలోనే ఉక్రెయిన్లో వెలుగులోకి వస్తున్న దృశ్యాలు హృదయవిదారకంగా మారిపోతున్నాయి అని చెప్పాలి. ఇటీవలే ఉక్రెయిన్ లో ఉన్న కీలకమైన నగరం అయినటువంటి మేరియు పోల్ లో కూడా ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి.


 ఇక రష్యా విధ్వంసకాండ లో ఇప్పటివరకు ఏకంగా 2500 మంది మరణించినట్లు ఉక్రెయిన్ అధ్యక్ష సలహాదారు హెఫ్లెక్సీ వెల్లడించారు. మెరియు పోల్ కి చేరుకొనే మానవతా సహాయాన్ని కూడా రష్యా అడ్డుకుంటుంది అంటూ ఇటీవలే ఆవేదన వ్యక్తం చేశారు ఆయన. గడిచిన రెండు రోజుల వ్యవధిలోనే మరణాల సంఖ్య భారీగా పెరిగింది అంటూ చెప్పుకొచ్చారు. మొత్తంగా యుద్ధం మొదలైన నాటి నుంచి 12 రోజుల్లో 1500 సాధారణ పౌరులు మృత్యువాత పడినట్లు తెలిపిన ఆయన కేవలం రెండు రోజుల వ్యవధిలోనే 1000 మంది చనిపోయారు అనే విషయాన్ని చెప్పుకొచ్చారు. ఇక అందరి మృతదేహాలను గుట్టలుగా చేర్చి సామూహిక అంత్యక్రియలు నిర్వహిస్తున్నట్లు చెప్పుకొచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: