అమెరికా అధ్యక్షుడిగా ఎట్టకేలకు బిడెన్ ఎంపికను ఖరారు చేసింది అమెరికా కాంగ్రెస్. బిడెన్ ఇక అధ్యక్షుడిగా ప్రమాణస్వీకారం చేయడం మాత్రమే మిగిలిఉంది. జనవరి 20 వ తేదీనా ఆ తంతు కూడా జరగనుంది. అయితే తన ప్రమాణ స్వీకారానికి ముందుగానే బిడెన్ తన బృందాన్ని ఏర్పాటు చేసుకున్నారు. కరోనా కారణంగా ఆర్ధిక నష్టాలలో కూరుకుపోయిన వ్యవస్థలకు మళ్ళీ పునర్వైభవం తీసుకురావడం ద్వారా మళ్ళీ అమెరికాను గాడిలో పెట్టాలని భావించిన బిడెన్ ముందు నుంచీ పక్కా ప్రణాళికతో సన్నద్ధం అయ్యారు.దాదాపు 100 మందితో కూడిన బృందాన్ని ఏర్పాటు చేసుకున్న బిడెన్ మెరికల్లాంటి యువతకు, అనుభవజ్ఞులకు ఈ బృందంలో స్థానం కల్పించారు.
బిడెన్ బృందంలో దాదాపు భారతీయుల సంఖ్యే అధికంగా ఉంది. అందులోనూ మహిళలకి బిడెన్ ప్రాధాన్యతను ఇచ్చారు. ఈ క్రమంలోనే మరో భారత సంతంతి మహిళా న్యాయవాదికి బిడెన్ కీలక బాధ్యతలు అప్పగించారు. అమెరికా అటార్నీ జనరల్ గా వనితా గుప్తాను బిడెన్ నియమిస్తూ కీలక ప్రకటన చేశారు. అయితే అమెరికా కాంగ్రెస్ ఆమె ఎంపికను అధికారికంగా ధ్రువీకరించిన తరువాత ఆమె మరో రికార్డ్ క్రియేట్ చేయనున్నారు. అదేంటంటే. వనితా గుప్తా ఎన్నికైతే అమెరికాలో అటార్నీ జరనరల్ గా మొట్టమొదటి శ్వేతజాతీయేతర మహిళగా ఆమె నిలువనున్నారు. బిడెన్ ఆమె ఎంపికపై మాట్లాడుతూ..
వనితా గుప్తా భారత్ నుంచీ వలస వచ్చిన మన కుమార్తె మనం గర్వించదగ్గ కుమార్తె అంటూ ప్రశంసల జల్లు కురిపించారు. అమాయకపు ప్రజల హక్కల కోసం, స్వేఛ్చ కోసం నిస్వార్ధంగా ఆమె పోరాటం చేశారని కొనియాడారు. వనిత గుప్తా గతంలో ఒబామా హయాంలో అడ్మినిస్ట్రేషన్ న్యాయశాఖ విభాగానికి నాయకత్వం వహించి ఎంతో మంచి పేరు తెచ్చుకున్నారు. అటార్నీజనరల్ పదవికి తనను ఎంపిక చేయడం పట్ల వనితా గుప్తా స్పందించారు. భారత్ నుంచి వచ్చి ఇక్కడ ఎంతో కీలకమైన పదవికి నేను ఎంపిక కావడం అదృష్టంగా భావిస్తున్నానని, నాపై బిడెన్ ఉంచిన నమ్మకానికి న్యాయం చేస్తానని తెలిపారు.