అంత సీన్ లేదమ్మా..తగ్గు తగ్గు: మహేష్

E. Rama Krishna
మహేష్ బాబు దగ్గర నుండి ఓ విషయంపై ఎన్ని సార్లు క్లారిటి తీసుకన్నా, అన్నిసార్లు ఒకే సమాధానం వస్తుంది. తాజగా దీనికి సంబంధించిన ఓ విషయం పై మహేష్ మరోసారి అదే క్లారిటిని ఇచ్చాడు. దీనికి సంబంధించిన వివరాల్లోకి వెళితే, ప్రిన్స్ మహేష్ బాబుకి ఇండియా వైడ్ గా ఫ్యాన్స్ ఉన్నారు.

తన మార్కెట్ సైతం ఇండియా వైడ్ గా ఉంది. ప్రస్తుతం మహేష్ తెలుగు, తమిళ, మలయాళం మార్కెలను టార్గెట్ చేసుకున్నాడు. తర్వరలోనే బిటౌన్ లోనూ మహేష్ చేసిన  మూవీలు డబ్బింగ్ రూపంలో ఒకేసారి అన్ని భాషలతోపాటు రిలీజ్ కానున్నాయి. ఇదిలా ఉంటే గతంలో మహేష్ బాలీవుడ్ సినిమాల్లో నటించేది లేదని తేల్చి చెప్పాడు. ఇప్పటి వరకూ చాలా బాలీవుడ్ సినిమాల నుండి అవకాశాల వచ్చినా,మహేష్ మాత్రం బిటౌన్ కి వెళ్ళలేదు.

అయితే తాజాగా ఓ ప్రముఖ తెలుగు న్యూస్ చానల్‌కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో మహేష్ బాలీవుడ్ ఎంట్రీపై తన అభిప్రాయాలు చెప్పుకొచ్చారు. అంతే కాకుండా ఇదే ఇక ఫైనల్, మళ్ళీ మళ్ళీ దీనికి గురించి అడగటం వేస్ట్ అనేశారు. మహేష్ బిటౌన్ ఎంట్రి గురించి చెబుతూ“బాలీవుడ్‌లో సినిమా చేయాలన్న ఆలోచనైతే లేదు. నేను ఇక్కడే ఇంకా చాలా నిరూపించుకోవాల్సి ఉంది. మనం ఇక్కడే గొప్ప సినిమాలు తీయాలి. మన తెలుగు సినిమా గురించి అక్కడ మాట్లాడుకోవాలి.

అదే నా డ్రీమ్ కూడా. ఈమధ్యే బాహుబలితో తెలుగు సినిమా స్టామినా అందరికీ తెలిసింది. ఇక్కడే మనం గొప్ప గొప్ప సినిమాలు చేయగల అవకాశం ఉన్నపుడు అక్కడికి వెళ్ళడం ఎందుకనిపిస్తుంది” అని తెలిపారు. అలాగే ఇదే క్వశ్ఛన్ మరోసారి రిపీట్ చేయబోతుంటే..తనదైన శైలిలో అంతలేదు..తగ్గు తగ్గు అంటూ తన గురించే వివరించుకున్నాడు ప్రిన్స్.



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: