గత శుక్రవారం విడుదలై నెగిటివ్ రివ్యూస్ ను రాబట్టుకున్న కూడా మొదటి మూడు రోజులు బాక్సాఫీస్ వద్ద డీసెంట్ ఓపెనింగ్స్ ను రాబట్టుకుని హిట్ దిశగా పయనిస్తోంది రాజుగారి గది 3. ఇక ఈ చిత్రం సోమవారం కూడా పర్వాలేదనే వసూళ్లను రాబట్టుకుంది. తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రం సోమవారం 68లక్షల షేర్ తో నాలుగు రోజుల్లో 4.14 కోట్ల షేర్ ను కలెక్ట్ చేసి బ్రేక్ ఈవెన్ కు చేరువలో వుంది. కామెడీ హర్రర్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రంలో సెకండ్ హాఫ్ లో వచ్చే కామెడీ సీక్వెన్స్ హైలైట్స్ అయ్యాయి.
ఇక ఈ చిత్రంతో డైరెక్టర్ ఓంకార్ హ్యాట్రిక్ విజయాన్ని ఖాతాలో వేసుకోనున్నాడు. అందులో భాగంగా ఈ సిరీస్ లో వచ్చిన మొదటి రెండు చిత్రాలు రాజాగారి గది , రాజుగారి గది 2 డీసెంట్ హిట్లు అయ్యాయి. ప్రస్తుతం మరో మూడు రోజుల వరకు రాజుగారి గది 3కి బాక్సాఫీస్ వద్ద పోటీ లేకపోవడంతో మంచి వసూళ్లనే రాబట్టుకోనుంది. ఆశ్విన్ బాబు , అవికా గోర్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రాన్ని ఓంకార్ సొంత ప్రొడక్షన్స్ ఓక్ ఎంటర్టైన్మెంట్స్ నిర్మించగా షబ్బీర్ సంగీతం అందించాడు. ఇదిలావుంటే ఈసిరీస్ కు సీక్వెల్ గా ఓ స్టార్ హీరో తో రాజుగారి గది 4 ను తెరకెక్కించే ప్లాన్ లో వున్నాడు ఓంకార్. త్వరలోనే ఈప్రాజెక్టు గురించి మరిన్ని వివరాలు వెలుబడనున్నాయి.
తెలుగు రాష్ట్రాల్లో ఏరియాల వారిగా ఈ చిత్రం యొక్క నాల్గో రోజు వసూళ్ల వివరాలు
నైజాం : 27 లక్షలు
సీడెడ్ : 12 లక్షలు
గుంటూరు :2 లక్షలు
కృష్ణా : 3.6 లక్షలు
పశ్చిమ గోదావరి : 3 లక్షలు
తూర్పు గోదావరి : 4 లక్షలు
ఉత్తరాంధ్ర : 10 లక్షలు
నెల్లూరు : 2.7 లక్షలు
ఏపీ &తెలంగాణ లో నాల్గో రోజు షేర్ మొత్తం = 0.64 కోట్లు