ఖుషి సినిమా తరువాత పది సంవత్సరాల పాటు పవన్
కళ్యాణ్ కు సరైన హిట్ రాలేదు. 2012 సంవత్సరంలో
బండ్ల గణేష్ నిర్మాతగా హరీష్
శంకర్ దర్శకత్వంలో
పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కిన గబ్బర్ సింగ్ బ్లాక్ బస్టర్ హిట్ అనిపించుకుంది. నాక్కొంచెం తిక్కుంది కానీ దానికో లెక్కుంది అంటూ పవన్ చెప్పిన డైలాగ్ బాగా ఫేమస్ అయింది. ఈ సినిమా తరువాత
పవన్ నటించిన అత్తారింటికి దారేది ఇండస్ట్రీ హిట్ కాగా గోపాల గోపాల సినిమా హిట్ అనిపించుకుంది.
అజ్ఞాతవాసి సినిమా తరువాత
పవన్ కళ్యాణ్ పూర్తిగా రాజకీయాలకే పరిమితం అయ్యాడు. కానీ
పవన్ కళ్యాణ్ దగ్గర కొందరు ప్రముఖ నిర్మాతల దగ్గర తీసుకున్న అడ్వాన్స్ లు ఉన్నాయి. ప్రస్తుతం పూర్తి స్థాయిలో రాజకీయాలకు పరిమితమైన
పవన్ కళ్యాణ్ హరీష్
శంకర్ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ లో ఒక సినిమాలో నటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ హరీష్
శంకర్ తో చర్చలు జరుపుతోందని తెలుస్తుంది.
దర్శకుడు హరీష్
శంకర్ మెగా
ప్రిన్స్ వరుణ్ తేజ్ కాంబోలో తెరకెక్కిన గద్దలకొండ గణేష్ సినిమా గత నెలలో విడుదలై హిట్ అనిపించుకుంది. హరీష్
శంకర్ కు మెగా కాంపౌండ్ కు చాలా సన్నిహితంగా ఉండే దర్శకునిగా కూడా పేరు ఉంది. మెగా ఫ్యామిలీ హీరోలైన
పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్, సాయిధరమ్ తేజ్,
వరుణ్ తేజ్ లతో హరీష్
శంకర్ సినిమాలు తీశాడు. ఈ సినిమాలన్నీ కూడా హిట్ అనిపించుకోవటం గమనార్హం.
పవన్
కళ్యాణ్ అభిమానులు కూడా
పవన్ సినిమాల్లో మరలా నటించాలని కోరుకుంటున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ
పవన్ కళ్యాణ్ తో కూడా చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. పవన్ హరీష్ కాంబినేషన్లో తెరకెక్కే సినిమా అంటే అభిమానుల్లో ఏ స్థాయిలో అంచనాలు ఉంటాయో చెప్పనవసరం లేదు. మైత్రీ మూవీ మేకర్స్ అధికారికంగా ఈ సినిమా గురించి ఎప్పుడు ప్రకటన చేస్తుందో చూడాలి.