ఆ ఇద్దరు మళ్ళీ ఫిక్సైయ్యారు.. ఎందుకో తెలుసా..?

Kunchala Govind
శృతిహాసన్ ఫస్ట్ సినిమా డిజాస్టర్ అయిన్నప్పుడు అందరు ఐరెన్ లెగ్ అన్నారు. కానీ ఆ తర్వాత హరీష్ శంకర్ దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా బాలీవుడ్ సినిమా దబాంగ్ రీమేక్ అయిన గబ్బర్ సింగ్ సినిమాతో టాలీవుడ్ లో సక్సస్ హీరోయిన్ అనిపించుకుంది. ఆ తర్వాత నుండి తెలుగులో చేసిన సినిమాలు అన్నీ దాదాపు హిట్ సినిమాలే. అయితే ఇటీవల తెలుగుకే కాదు మొత్తంగా సినిమాలకే దూరం అయ్యింది శృతిహాసన్. ఆమె వ్యవహార శైలి కొంత, ఇతరత్రా వ్యవహారాలతో బిజీ కావడం కొంత కలిసి శృతి ని తెలుగు సినిమాలకు దూరం చేశాయి. అయితే ఇప్పుడు శృతి పూర్తిగా మారిపోయింది అని ఇండస్ట్రీలో టాక్. ఫాలో అప్, ఫోన్ ఆన్సర్ లు అన్నీ చాలా పద్దతిగా చేస్తోందని తాజా సమాచారం.

దీంతో ఇప్పుడు మళ్లీ ఆమె వైపు టాలీవుడ్ జనాల చూపు మళ్ళీంది. గోపీచంద్ మలినేని-రవితేజ కాంబినేషన్ లో తెరకెక్కబోయో సినిమాకి శృతిని హీరోయిన్ గా ఫిక్స్ చేసారు. అగ్రిమెంట్ కూడా కంప్లీటయిందని లేటెస్ట్ అప్‌డేట్. గతంలో వీరిద్దరి కాంబినేషన్ లో బలుపు సినిమా వచ్చిన సంగతి తెలిసిందే. మళ్లీ ఇప్పుడు అదే సక్సెస్ ఫుల్ కాంబినేషన్ రిపీట్ అవుతోంది. ఈ సినిమా ఇద్దరికి మంచి కమర్షియల్ సక్సస్ ను ఇచ్చింది. అంతేకాదు ఈ సినిమాలో శృతి హాసన్-బ్రహ్మనందం మధ్య కామెడి ట్రాక్ అద్భుతంగా వర్కౌట్ అయింది కూడా.

ప్రస్తుతం డిస్కోరాజా సినిమా చేస్తున్నారు రవితేజ. వరుసగా ఫ్లాప్స్ వస్తున్న రవితేజ ఈ సినిమా మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు. ఆ సినిమా అయిపోగానే గోపీచంద్ మలినేని-రవితేజ కాంబో లో సినిమా స్టార్ట్ అవుతుంది. గోపీచంద్ మలినేని ఫన్ బాగా పండిస్తారు. కానీ ఈసారి ఆయన సినిమాకు బుర్రా సాయిమాధవ్ పని చేస్తున్నారు. రైటర్ గా అన్నిరకాల ప్రూవ్ చేసుకున్న బుర్రా సాయిమాధవ్ ఇప్పటివరకు ఎంటర్ టైన్ మెంట్ జోనర్ లో ఇంకా ప్రూవ్ చేసుకోలేదు. అక్కడ ఇంకా వీక్ గానే వున్నారు. ఈ సినిమాతో ఆ లోటు కూడా తీరుతుందేమో అని ఇండస్ట్రీలో మాట్లాడుకుంటున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: