స్టార్ డైరెక్టర్ రాజమౌళి తనయుడు కార్తికేయ ఇటీవల చిత్ర నిర్మాణ రంగంలోకి ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. రాజమౌళి శిష్యుడు అశ్విన్ గంగరాజు ను డైరెక్టర్ గా పరిచయం చేస్తూ కార్తికేయ నిర్మిస్తున్నమొదటి చిత్రం 'ఆకాశవాణి'. సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం ఇటీవల కేవలం ఒకే ఒక్క షెడ్యూల్ లో షూటింగ్ ను పూర్తి చేసుకుంది. 50రోజుల పాటు ఈ షెడ్యూల్ డిఫ్రెంట్ లొకేషనల్లో జరిగింది. ఈ చిత్రంలో ప్రముఖ తమిళ నటుడు సముద్రఖని ముఖ్య పాత్రలో నటించాడు. కాగా విలన్ పాత్ర సినిమాకు మెయిన్ హైలైట్ అయితే ఆ పాత్రకు కొత్త నటుడుని తీసుకున్నారు.
ఇక ఈ సినిమా చూసిన రాజమౌళి కి ఆ పాత్ర ను తెరకెక్కించిన విధానం నచ్చలేదట సినిమాకు మార్పులు అవసరమని భావించాడు. దాంతో వేరే నటుడి ని తీసుకొని ఆ పాత్ర ను మళ్ళీ రీషూట్ చేసారు. ప్రస్తుతం సినిమా అయితే ఓ కొలిక్కి వచ్చింది. సరైన సమయం చూసి సినిమా విడుదలచేయడానికి రెడీ అవుతున్నారు మేకర్స్.
ఈ చిత్రానికి కీరవాణి తనయుడు కాల బైరవ సంగీతం అందిస్తున్నాడు. ఆయనకు మ్యూజిక్ డైరెకర్ గా ఇదే మొదటి సినిమా. కాగా ప్రముఖ మాటల రచయిత సాయి మాధవ్ బుర్రా డైలాగ్స్ అందిస్తున్నారు. కేవలం 5కోట్ల బడ్జెట్ లోనే ఈసినిమాను పూర్తి చేసారని సమాచారం. మరి కార్తికేయ కు నిర్మాతగా ఈ సినిమా ఎలాంటి అనుభవాన్ని ఇస్తుందో చూడాలి.
ఈ చిత్రానికి కీరవాణి తనయుడు సింగర్ కాల బైరవ సంగీతం అందిస్తున్నాడు. ఆయనకు మ్యూజిక్ డైరెకర్ గా ఇదే మొదటి సినిమా. కాగా ప్రముఖ మాటల రచయిత సాయి మాధవ్ బుర్రా డైలాగ్స్ అందిస్తున్నారు. కేవలం 5కోట్ల బడ్జెట్ లోనే ఈసినిమాను పూర్తి చేసారని సమాచారం. మరి కార్తికేయ కు నిర్మాతగా ఈ సినిమా ఎలాంటి అనుభవాన్ని ఇస్తుందో చూడాలి. ఇక రాజమౌళి ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ సినిమా షూటింగ్ తోబిజీగా వున్నాడు.