'ఛాన్స్'లు లేక మాల్స్ వైపు చూస్తోన్న హీరోయిన్ !
కొంతమంది హీరోయిన్లు ఒక సినిమాతోనే ఓవర్ నైట్ లో స్టార్ హీరోయిన్ లు అయిపోతుంటారు. అప్పుడెప్పుడో సుకుమార్ నిర్మాణంలో వచ్చిన 'కుమారి 21 ఎఫ్' సినిమాతోనూ అలా ఓవర్ నైట్ లోనే ఫుల్ క్రేజ్ సంపాదించుకున్న హీరోయిన్ హెబ్బా పటేల్. ఆ సినిమా పుణ్యమా అని టాలీవుడ్ లో ఈ అమ్మడికి హీరోయిన్ గా బాగానే అవకాశాలు వచ్చాయి. కానీ ఆ తరువాత వరుస ప్లాప్ లతో ఈ హీరోయిన్ కి ప్రస్తుతం ఛాన్స్ లు లేకుండా పోయాయి. దాంతో ఆ మధ్య వరుసగా బోల్డ్ సినిమాలు అంగీకరిస్తూ రెచ్చిపోయింది.
అమ్మడు లాస్ట్ సినిమా '24 కిస్సెస్'లోనూ తన బోల్డ్ యాక్టింగ్ తో హద్దుఅదుపు లేకుండా ఒళ్ళు దాచుకోకుండా కష్టపడినప్పటికీ ఆ సినిమా విజయం సాధించలేకపోయింది. దాంతో చెప్పుకునే స్థాయి ఉన్న సినిమా ప్రస్తుతం హెబ్బా పటేల్ చేతిలో భీష్మ సినిమా మాత్రమే. అలాగే సుశాంత్ రెడ్డి అనే దర్శకుడు దర్శకత్వంలో ప్రిన్స్ హీరోగా 'రాడికల్' చిత్రం ఉంది. ఈ సినిమాల కోసం మహా అయితే నెలలో పది పదిహేను రోజులు వర్క్ చెయ్యాల్సి ఉంటుంది. మిగిలిన రోజులన్నీ ఖాళీగానే కూర్చుకోవాలి. అందుకే గత కొన్ని నెలలుగా మాల్స్ ఓపెన్ చేసే ఛాన్స్ స్ కోసం తెగ ట్రే చేస్తోదట. పాపం హెబ్బా షాపింగ్ మాల్స్ ను ఓపెన్ చేయడం కోసం కూడా ఎదురుచూస్తోంది.