ఒకప్పుడు పూరి సినిమాలకు ఎంత క్రేజ్ ఉండేదో చెప్పక్కర్లేదు. ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం, అమ్మా నాన్న తమిళ అమ్మాయి, ఇడియట్, పోకిరి, బిజినెస్ మెన్ ఇలా చెప్పుకుంటూ పొతే చాలా ఉన్నాయి. మహేష్ తో చేసిన పోకిరి సినిమా అప్పట్లో సంచనలం. మహేష్ బాబు స్టైల్ ను పూర్తిగా మార్చేసిన సినిమా అది.
ఆ తరువాత మహేష్ తో బిసినెస్ మెన్ చేశాడు. అది బంపర్ హిట్ అయ్యింది. ఆ తరువాత కూడా కొన్ని మంచి సినిమాలు చేశారు. ఏమైందో ఏమో గత కొంతకాలంగా పూరికి విజయం లేదు. టెంపెర్ తరువాత విజయాల కోసం మొహంవాచిపోయింది.
పూరి పరాజయాల బాటలో ఉన్నప్పుడు మహేష్ కు జనగణమణ సినిమా స్టోరీ చెప్పాడు. కథ బాగున్నా సరే పూరిపై నమ్మకం లేకపోవడంతో పక్కన పెట్టాడు. పూరి కూడా చేస్తే ఆకథను మహేష్ తోనే చేయాలి అని చెప్పి కథను పక్కన పెట్టారు. ప్రస్తుతం ఇస్మార్ట్ శంకర్ సినిమా చేస్తున్నాడు.
ఈ సినిమా పూరికి చాలా కీలకం. సినిమా హిట్టయితే మరలా పూరి లైన్లోకి వస్తాడు. మహేష్ బాబును ఒప్పించే ప్రయత్నం చేస్తాడు. పూరితో సినిమా చాలా స్పీడ్ గా కంప్లీట్ అవుతుంది. సరిలేరు నీకెవ్వరూ తరువాత 27వ సినిమా ఆలస్యమైతే పూరి తో సినిమా ప్లాన్ చేసుకుంటే సరిపోతుంది.