తెలుగు ప్రేక్షకులకు ఎంతో ఇష్టమైన ప్రోగ్రామ్ జబర్ధస్త్ కామెడీ షో. ఈ కార్యక్రమం మొదలై ఆరు సంవత్సరాలు అవుతుంది. ఎంతో మంది కమెడియన్లు వచ్చారు పోయారు. కానీ మొదటి నుంచి జడ్జీలుగా వ్యవహరిస్తున్న మెగా బ్రదర్ నాగబాబు, నటి రోజా కంటిన్యూగా ఉంటూ వస్తున్నారు. అప్పుడప్పుడు వారి స్థానాలు మారినా ఎప్పుడూ సుదీర్ఘకాలంగా పక్కకు తప్పుకోలేదు. కానీ ఇటీవల కాలంలో ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల సందర్భంగా వీరిద్దరూ పోటీలో తలపడ్డారు.
దాంతో ప్రచార కార్యక్రమాల్లో పాల్గొనేందుకు కొంత కాలం సెలవు తీసుకున్నారు. దాంతో జబర్ధస్త్ కామెడీ షో నుంచి రోజా, నాగబాబు ఔట్ అని వార్తలు వచ్చాయి. అంతే కాదు వారి స్థానంలో జడ్జీలుగా మీనా, జానీ మాస్టార్లు వస్తున్నారు. అయితే ఈ మద్య నాగబాబు ఓ ఇంటర్వ్యూలో తాను జబర్ధస్త్ కామెడీ షో విడిచే ప్రసక్తే లేదని స్టేట్ మెంట్ ఇచ్చారు. మరోవైపు జాని మాస్టార్ స్థానంలో రోజా కంటిన్యూ అవుతున్నారు.
ఈ నేపథ్యంలో షోలో మరో సెలబ్రిటీ జడ్జి దర్శనమిచ్చింది. ఆమె మరెవరో కాదూ.. సీనియర్ హీరోయిన్ సంఘవి. రోజాతో కలిసి సంఘవి జబర్దస్త్ షో జడ్జిగా వ్యవహరించారు. మీనా స్థానంలో సంఘవిని తీసుకొచ్చినట్లుగా అనిపిస్తోంది. కన్నడకి చెందిన సంఘవి పదిహేనేళ్ల క్రితం హీరోయిన్ గా పలు చిత్రాల్లో నటించింది. దాదాపు అప్పటి అగ్ర హీరోలు చిరంజీవి, బాలకృష్ణ, నాగర్జున వంటి స్టార్ల సరసన నటించి మెప్పించింది. నాగబాబు రీఎంట్రీ ఇచ్చేవరకు సంఘవిని కంటిన్యూ చేస్తారని అంటున్నారు.