మాట తప్పిన బాలయ్య మహానాయకుడి పరిస్థితి అయోమయం !

Seetha Sailaja
‘మహానాయకుడు’ మూవీ మరో 48 గంటలలో విడుదల కాబోతున్నా ఈసినిమాకు సంబంధించిన సందడి కనీసం బాలకృష్ణ అభిమానులలో కూడ కనిపించకపోవడం ఇండస్ట్రీ హాట్ టాపిక్ గా మారింది. బాలకృష్ణ సినిమా విడుదల అవుతోంది అంటే చాలు ఆసినిమా గురించి బాలయ్య అభిమానులు చేసే సందడి విపరీతంగా ఉంటుంది.

అయితే ఈ పరిస్థుతులకు భిన్నంగా ‘మహానాయకుడు’ విడుదలకు ముందు బాలయ్య అభిమానుల మధ్య నెలకున్న మౌనం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగిస్తూ కనీసం ఈమూవీకి గౌరవప్రదమైన ఓపెనింగ్ కలక్షన్స్ అయినా వస్తాయా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఈ పరిస్థుతులు ఇలా కొనసాగుతూ ఉంటే బాలకృష్ణ మాట తప్పాడు అంటూ వస్తున్న వార్తలు బాలయ్య అభిమానులను మరింత గందరగోళంలో పడేస్తున్నాయి. 

‘కథానాయకుడు’ మూవీకి సంబంధించి ఆమూవీని కొనుక్కున్న బయ్యర్లకు 50 కోట్ల వరకు నష్టాలు రావడంతో ఆ నష్టాలను తీర్చడానికి బాలకృష్ణ పెద్ద మనసుతో ‘మహానాయకుడు’ మూవీ రైట్స్ ను ‘కథానాయకుడు’ బయ్యర్లకు ఇచ్చినట్లుగా వార్తలు వచ్చాయి. అయితే ఈ వార్తలు నిజం కాదని ‘మహానాయకుడు’ మూవీని కేవలం కమీషన్ పద్దతిలో ‘కథానాయకుడు’ బయ్యర్లకు ఇచ్చాడని ఇప్పుడు వార్తలు వస్తున్న నేపధ్యంలో బాలకృష్ణ మాట తప్పాడు అంటూ విపరీతమైన విమర్శలు వస్తున్నాయి. 

దీనితో బాలయ్య పై జరుగుతున్న నెగిటివ్ ప్రచారాన్ని అడ్డుకోలేక ‘మహానాయకుడు’ ని హిట్ చేసే శక్తిలేక జరుగుతున్న పరిణామాలు చూస్తూ ఎన్టీఆర్ బయోపిక్ తీసి బాలకృష్ణ తప్పు చేసాడా అన్న భావనలో బాలయ్య అభిమానులు కూడ ఉన్నట్లు టాక్. దీనికితోడు ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో ఊహించని పరాజయం ఎన్టీఆర్ బయోపిక్ కు రావడం తెలుగుదేశ వర్గాల మానసిక స్థైర్యాన్ని కూడ దెబ్బతీస్తున్నట్లు కామెంట్స్ వస్తున్నాయి..  


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: