తెలుగు ఇండస్ట్రీలో యువ దర్శకుల్లో ఒకరు సురేందర్ రెడ్డి. కిక్, రేసుగుర్రం, ధృవ వంటి హిట్ చిత్రాలతో బాక్సాఫీస్ని షేక్ చేసిన ఈ దర్శకుడు మరో అద్భుతాన్ని ఆవిష్కరించబోతున్న విషయం తెలిసిందే. మెగాస్టార్ చిరంజీవి 151వ చిత్రాన్ని సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించబోతున్నారు. అలనాటి స్వాతంత్ర సమరయోధుడు ఉయ్యాలవారి నరసింహారెడ్డి జీవిత కథ ఆధారంగా ‘సైరా నరసింహారెడ్డి’చిత్రాన్ని తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రానికి రాంచరణ్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.
ఈ చిత్రం షూటింగ్ షరవేగంగా జరుగుతుంది. వచ్చే యేడాది ఈ చిత్రం రిలీజ్ కావొచ్చని బావిస్తున్నారు. భారీ బడ్జెట్తో తెరకెక్కుతున్న ఈ చిత్ర టీజర్ ఇప్పటికే విడుదల కాగా, ఇది సినీ ప్రేక్షకులని ఎంతగానో ఆకట్టుకుంది. సైరా వంటి పీరియాడికల్ చిత్రాన్ని సురేందర్ రెడ్డి ఎలా తెరకెక్కిస్తున్నాడా అనే అనుమానం అందరిలో నెలకొంది. తాజాగా సైరా సెట్ లో సురేందర్ రెడ్డి తన తనయులతో ఫోటో తీయించుకున్నారు. ఆ ఫోటో షేర్ చేస్తూ.. నా పిల్లలతో సైరా సెట్లో అనే కామెంట్ పెట్టాడు.
భారీ బడ్జెట్తో తెరకెక్కుతున్న ఈ చిత్ర టీజర్ ఇప్పటికే విడుదల కాగా, ఇది సినీ ప్రేక్షకులని ఎంతగానో ఆకట్టుకుంది.కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ బేనర్పై రామ్ చరణ్ సైరా చిత్రాన్ని నిర్మిస్తుండగా యాక్షన్ సీన్స్ కోసం స్కైఫాల్, హ్యారీ పొటర్లకి పని చేసిన హాలీవుడ్ స్టంట్ మాస్టర్లు పని చేస్తున్నారు. సినిమాటోగ్రాఫర్గా రత్నవేలు ఉన్నారు.