ఎన్టీఆర్ కథానాయకుడుపై సూపర్ స్టార్ మహేష్ కామెంట్..!

shami
ఈరోజు రిలీజైన ఎన్.టి.ఆర్ బయోపిక్ మొదటి పార్ట్ ఎన్.టి.ఆర్ కథానాయకుడు సినిమా మొదటి షో నుండి పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. సినిమాలో బాలకృష్ణ నటనకు ప్రేక్షక నీరజనాలు అందుకుంటున్నాడు. ఇక ఈ సినిమా చూసిన దర్శకులు చాలామంది సినిమా గురించి తమ స్పందన తెలియచేస్తుండగా స్టార్ హీరోల్లో మొట్టమొదటిగా సూపర్ స్టార్ మహేష్ ఎన్.టి.ఆర్ బయోపిక్ పై స్పందించాడు.


వాస్తవికత కథతో దర్శకుడు క్రిష్ ఎన్.టి.ఆర్ బయోపిక్ ను ఎంతో అద్భుతంగా తెరకెక్కించారు. బాలకృష్ణ గారు ఎన్.టి.ఆర్ గారిలా ప్రతి చిన్న సీన్ లోనూ జీవించేశారు. సినిమాలోని మిగతా అన్ని పాత్రలన్ని బాగా చేశారు. ఇది లెజెండరీ ఎన్.టి.ఆర్ కు బెస్ట్ ట్రిబ్యూట్ అవుతుందని అన్నారు మహేష్.


ఒకవేళ దీన్ని మించేది ఏదైనా ఉంది అంటే అది మళ్లీ ఎన్.టి.ఆర్ మహానాయకుడే అవుతుందని ట్వీట్ చేశారు. దానికోసం ఎదురుచూస్తున్నా టీం అందరికి కంగ్రాట్స్ అంటూ మహేష్ ఎన్.టి.ఆర్ కథానాయకుడి మీద ప్రశంసల వర్షం కురిపించాడు. సూపర్ స్టార్ కృష్ణకు ఎన్.టి.ఆర్ తో ఉన్న అనుబంధం తెలిసిందే.


Surreal & large... @DirKrish has painted the canvas with an out of the world experience👍 Balakrishna garu has gone into the skin of #NTR garu's character and LIVED EVERY BIT OF IT🙏 All the characters penned & portrayed are 100% true to life. Brilliant👌 pic.twitter.com/57NvTgu1jM

— Mahesh Babu (@urstrulyMahesh) January 9, 2019 If there's going to be anything better than #NTRKathanayakudu, it's going to be #NTRMahanayakudu. Looking forward already. Congratulations to the entire team👏👏👏

— Mahesh Babu (@urstrulyMahesh) January 9, 2019
అప్పట్లో ఎన్.టి.ఆర్ కు పోటీగా కొన్ని ప్రయత్నాలు చేశారు సూపర్ స్టార్ కృష్ణ. ఎన్.టి.ఆర్, కృష్ణల కాంబినేషన్ లో దేవుడు చేసిన మనుషులు సినిమా వచ్చింది. ఆ సినిమా పెద్ద విజయాన్ని అందుకుంది. ఎన్.టి.ఆర్ బయోపిక్ ఆడియో రిలీజ్ కు కృష్ణ గారు అటెండ్ అవడం జరిగింది. మొత్తానికి ఎన్.టి.ఆర్ కథానాయకుడు మీద మొదటిగా మహేష్ స్పందించి నందమూరి ఫ్యాన్స్ మనసులు గెలిచాడు.



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: